Saturday, March 24, 2012

తెలుగు బ్లాగుల బాగోగులు


"బ్రాహ్మణ వాద పునరుజ్జీవం : తెలుగు బ్లాగులు" (http://seperateandhra.blogspot.in/2012/03/blog-post_23.html) అని ఇందాకా కట్టా సుఖేంద్ర రెడ్డి గరు రాసిన ఒక పోస్టు చదివాను. అందులో ఆర్గ్యుమెంటుని దాదాపు బ్రాహ్మణకులానికి ఆపాదించడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తానుగానీ, మూల భావనని అంగీకరిస్తాను. అటు సామాజికంగా, ఇటు సాహితీపరంగా బ్రాహ్మణవాదానికి (బ్రాహ్మణ కులం కాదు) స్థానం క్రమేణా పబ్లిక్ స్పేస్ లో తగ్గిన క్రమంలో ఆభావజాలాలకు తెలుగు బ్లాగులు పట్టుకొమ్మలయ్యాయి.

సంస్కృతి సాంప్రదాయం, మతనిబద్ధత, భాషాభిమానం, దేశ భక్తి పేర్లతో ఒక మారువేషపు బ్రాహ్మణవాదం బ్లాగుల్లో ప్రచులితమై ఉంది. ఏ ఇతర ఆల్టర్నేట్ ఐడియాలజీని తెలుగు బ్లాగులోకం భరించదు. దాని ఉనికిని నాశనం చెయ్యడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. సమాజంలో ఆర్థకంగా-సామాజికంగా-రాజకీయంగా ఆధిపత్యాన్ని ఉపయోగించినట్లు ఇక్కడ సాంకేతికంగా వారికున్న ఆధిపత్యాన్ని ఉపయోగించి "దాడి" చేస్తారు. ప్రత్యామ్న్యాయానికి ఉనికి లేకుండా చేసి తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోంటారు.

తెలుగు బ్లాగులోకం ఈ పద్దతుల వల్లనే అల్లకల్లోలమయ్యింది. ఇప్పుడు ఈ పరిస్థితి కంటిన్యూ అవుతోంది కాబట్టే వైవిధ్యం నశిస్తోంది. బ్లాగులోకం కేవలం భద్రలోకానికే అనే రకంగా తయారయ్యాయి.  

****