Thursday, December 31, 2009

బ్లాగులు నాకేమిచ్చాయి?




టైంపాస్ కి నేను బ్లాగు మొదలెట్టలేదు. నా ఆలోచనలూ,అభిప్రాయాలూ,అనుభవాలూ (ఒకవేళ ఉంటే) ఆధర్శాలు రాసుకోవడానికి బ్లాగు మొదలెట్టాను. ఎప్పుడో మర్చిపోయిన "తెలుగులో రాయడాన్ని" సానబెట్టుకోవడానికి మొదలెట్టాను.

మొదలెట్టిన రెండున్నర సంవత్సరాల్లో ఎన్నో అనుభవాలు.
కొన్ని అహ్లాదపరిచేవి, కొన్ని కలవరపెట్టేవి. 
ఎన్నో వాదాలూ వివాదాలు. 
కొన్ని మెదడుకు పదునుపెట్టేవి, మరికొన్ని మనసుని (గాయ)గట్టిపరిచేవి.
ఎన్నో ఆలోచనలు.
కొన్ని నన్నునాకు పరిచయం చేసేవి,మరికొన్ని ఇతరులకు నాపరిచయం కలుగజేసేవి.
ఎందరితోనో పరిచయాలు.
కొన్ని జీవితాన్ని మార్చేవి, మరికొన్ని జీవన మూల్యాల్ని ప్రశ్నించేవి/బలపర్చేవి.

ఇలా బ్లాగు నా వ్యక్తిత్వంలో భాగమయ్యింది. ఎన్నో మార్పులు,ఒత్తిడుల మధ్య 2009 లో నా బ్లాగులో నేను తక్కువ రాశానేమో అనిపించింది.కానీ లెక్క చూసుకుంటే 171 టపాలు తేలాయి. ఒకనెలలో ఏకంగా 30 టపాలున్నాయి.

బ్లాగుల్లో రాయడం వలన నా ఎన్నో ఆలోచనలకు పదాలు దొరికాయి. నా అభిప్రాయాల పదును పెరిగింది. వాటిని చెప్పే విధానంలో నాదంటూ ఒక శైలి కలిగింది. ఇదే సాధన మొదటిమెట్టుగా నా సినిమా ఆశయం నెరవేర్చుకునే అవకాశం వచ్చింది. ఈ సంవత్సరం ఒక సినిమాకు మిత్రుడు వెంకట్ తో కలిసి మాటలు రాశాను. నూతన సంవత్సరంలో రిలీజయ్యే ఈ సినిమా పేరు "న్యూ". మొదటిసారి వెండితెరపై నా పేరు కనిపిస్తుంది. నా రాతలకు మరో గుర్తింపు వస్తుంది.

బ్లాగులు నాకింకా ఏమిచ్చాయి? తెలీదు. ముందుముందు చూడాలి.

అందరికీ "న్యూ" సంవత్సర శుభాకాంక్షలు.

"న్యూ" చిత్రం వెబ్ సైట్ కోసం ఇక్కడ చూడండి.

**** 

Friday, December 25, 2009

‘న్యూ’ సంవత్సర శుభాకాంక్షలు




ఈ గ్రీటింగ్ కార్డులకోసం www.new.navatarangam.com చూడండి.


****

Tuesday, December 22, 2009

భాష గోల


ఒకప్పుడు ప్రపంచంలోని ప్రజలంతా ఒకటిగా ఉండేవారట.
కలిసికట్టుగా. ఐకమత్యంగా. సంఘటితంగా. ఒకటిగా.
ఆ ఐకమత్యంవలనొచ్చిన బలంతో, ఒక పెద్ద స్థంభాన్నికట్టి స్వర్గానికి చేరుకుందామని జనం ప్లానేశారు.
ఆ ఒంటిస్థంభం మేడ నిర్మాణం మొదలయ్యింది. ఆ..వీళ్ళేంకడతార్లే అని దేవతలు ఊరుకున్నారట.
కానీ ఆ మేడ రోజురోజుకీ పెరిగి స్వర్గాన్ని చేరేదాకా వచ్చేసింది.
దేవుడు ఆ స్థంభాన్ని ఒకసారి కూల్చేసాడు.
జనం మళ్ళీ కలిసి ఇంకొకటికట్టారు.
మళ్ళీ దేవుడు కూల్చేసాడు.
జనం మళ్ళీకట్టారు...దేవుడు కూల్చేసాడు...జనం మళ్ళీ కట్టారు.
దేవుడికి దడ మొదలయ్యింది...ఇలా అయితే మనుషులందరూ స్వర్గానికి హైవేలో ఎప్పటికైనా వచ్చేస్తారని తెలిసొచ్చింది.

వెంఠనే...దేవుడు భాషని సృష్టించాడు.
అప్పట్నుంచీ ఇప్పటివరకూ మనుషులంతా ఒకటికాలేకపోయారు.
కొట్టుకుంటూనే ఉన్నారు. స్వర్గాన్ని అందుకోలేకపోయారు.

**** 

Sunday, December 20, 2009

ప్రేమజ్యోతి



అలవాటైన పరిచయాల నీడలు
చీకట్లను ప్రసరిస్తున్నా
ప్రేమజ్యోతిని మాత్రం
ఉజ్వలంగా వెలగనీ



The light of love

let the light of love
shine through
even when
the darkness
of familiarity
begins to cast it's shadows

- శేఖర్ కపూర్


Thursday, December 10, 2009

శాంతి కావాలా?


అంత:శోధన
శాంతిని దరిచేర్చదు
శాంతి కావాలంటే...
ఓమందేసుకో
సంగీతాన్ని విను
ధ్యానం చెయ్! ఒక సూదీర్ఘమైన శ్వాస పీల్చుకో!!
ప్రేమించు
జీవితంతో రాజీపడు

Thursday, December 3, 2009

విమర్శకుడి బాధ్యత



సాహిత్యసృజన విమర్శనకన్నా ఎప్పుడూ ఒక మెట్టు ఎక్కువే. ఎందుకంటే, ‘తులనకన్నా సృష్టి ఉన్నతం ’కాబట్టి. అది ఎలాంటిదైనా సరే, సృష్టి సృష్టే!


 వర్డ్స్ వర్త్ చెప్పినట్లు సృజనాత్మకత అనేది "emotions recollected in tranquility". కాబట్టి, అక్కడ తర్కానికీ,తులనకూ స్థానం లేదు. మనిషీ ప్రకృతీ ఒక బలవత్తరమైన స్థాయిలో సంగమించి సాహితీసృజనకు ప్రాణంపోస్తాయి.

అలా సృష్టించబడిన సాహిత్యంలో తర్కాన్ని,తులలను ప్రవేశపెట్టి సామాజిక ప్రయోజనాన్నీ గుర్తించి ఆ ఆలోచనల్ని పాఠకులదగ్గరికి తీసుకొచ్చేవాడే విమర్శకుడు. అంటే తమ విశ్లేషణతో సృజనాత్మకతలోని నిగారింపుని గుర్తించే పరీక్షకుడు విమర్శకుడు.అంతటి బృహత్తర కార్యాన్ని భుజాన వేసుకున్న విమర్శకుడికి బాధ్యత,నిబద్ధత చాలా అవసరం.

వ్యక్తిగత అభిప్రాయాలకన్నా సామాజిక ప్రయోజనాన్ని ముందుంచాలి. ఉత్తమమైన ఆలోచనల గుర్తింపుకు ప్రాధాన్యత ఇవ్వాలి.ముఖ్యంగా రచనను రచనగా చూడాలి.

విమర్శకుడి బాధ్యత "to make the best ideas prevail. New ideas reach society.The touch of truth is the touch of life, and there is a stir and growth everywhere; out of this stir and growth come the creative epochs of literature." ఆ ఉత్తమమైన ఆలోచనల వ్యాప్తిద్వారా మరింత సాహితీసృజన జరిగే అవకాశాల్ని మెరుగు పర్చడం.

విమర్శకుడికి అనుకున్నది చెప్పే అధికారంకన్నా, రచన ఆదర్శాన్ని అర్థంచేసుకుని విశ్లేషించడం ముఖ్యం. తన అనుకోలుకు తగ్గ ఆధారాలు చూపుతూ పాఠకుడికి రచనను పరిచయం చేస, దాని "విలువను" తెలపడం ముఖ్యం. ఆ రచన ఒక విఘాతమైతే దాని గురించి ‘వార్న్’చెయ్యడం ముఖ్యం.

ఈ మూలభావనలకు విఘాతంకలిగేలా విమర్శనం చేస్తే అది కేవలం "విమర్శ" అవుతుంది.నింద అవుతుంది. అది చాలా మంది mediocre విమర్శకులు చేస్తారు.  విమర్శకులంటూ  సాహిత్యాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నవాళ్ళు "కేవలం భాధ్యతాయుతంగానే" రాయాలి.

****

Tuesday, December 1, 2009

ఆర్య లాంటి ఫ్రెండుంటే - కేసీఆర్ లాంటి నాయకుడుంటే










ఈ మధ్యే విడుదలైన ఆర్య-2 సినిమా "ఆర్య లాంటి ప్రెండ్ వుంటే చాలు వేరే శత్రువులు అక్కర్లేదు…" అనే డైలాగ్ తో మొదలౌతుంది. సినిమా మొత్తం అతిప్రేమ-సైకోప్రేమ- అతిసైకో చేష్టలతో ఆర్య పిచ్చిపిచ్చిగా సినిమా మొత్తం ఎనర్జీతో గెంతి, ప్రేక్షకుల్ని 70MM లో వెధవల్ని చేసి బయటికి పంపిస్తాడు...

అదే పిచ్చి నాకు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు KCR చేసిన "ఆమరణ నిరాహారదీక్ష" డ్రామాలో కనిపించింది. ఇలాంటి నాయకుడే ఉండే తెలంగాణాకి మరే శత్ర్రువూ అవసరం లేదు. నట్టేట ముంచాడు, ముంచుతాడు, ముంచుతూనే ఉంటాడు. తెలంగాణా ఎప్పటికీ రాకపోవడానికి కారణమెవరైనా ఉంటే అది కె.సి.ఆర్ మాత్రమే.

****

Sunday, November 29, 2009

యువతరం "న్యూ" మనోభావాలు






****

Friday, November 27, 2009

ప్రగతికోసం ఆంగ్లభాష - చేతన్ భగత్


ఈ ప్రపంచీకరణ యుగంలో ఇంగ్లీషు భాష ఒక ముఖ్యమైన అవసరం. అది ఒక వ్యక్తియొక్క సామాజిక-ఆర్థిక-మానసిక స్థితిని నిర్దేశించే స్థాయికి ఎదిగిపోయింది. అసంకల్పితమో, అప్రయత్నమో లేక ఒక చారిత్రాత్మక ప్రమాదమో తెలీదుగానీ, భారతీయ జీవితంలో ఇంగ్లీషు ప్రాధాన్యత అమూల్యం అయిపోయింది. ప్రగతికోసం ఆంగ్లభాష తప్పదు అనే స్థితికి మనం చేరుకున్నాం.

ఇంగ్లీషు భాషకు ప్రాధాన్యత పెరిగినంత మాత్రానా దేశభాషలు, దేశీయభాషలు తరిగిపోవడమో వాటి వాడకం కుంచించుకుపోవడమో జరగాల్సిన అవసరం లేదు. కానీ తెలుగుకి ఈ పరిస్థితి పడుతుందని కొందరు వాపోవడానికి కారణం మాత్రం ఒక్క ఇంగ్లీషు ఉపయోగమైతే కాదని నా నమ్మకం.

ఈ సందర్భంగా ఒక మిత్రుడు, Five Point Someone, One night @ The Call Center, The Three Mistake of my Life, 2 States- The Story of My Marriage వంటి నవలలు రాసిన చేతన్ భగత్,  బ్రిటిష్ కౌన్సిల్ వారు నిర్వహించిన "English for Progress conference" లో చేసిన ప్రసంగాన్ని పంపారు. ఆ ప్రసంగంతో నేను నూరుశాతం ఏకీభవిస్తాను. ఆ వ్యాసం మీకోసం ఈ క్రింద పొందుపరుస్తున్నాను.


British Council English Language Policy Dialogue
Speech by Chetan Bhagat
19 November 2009

Ladies and Gentlemen,
Thank you for inviting me today and giving me a chance to be part of the English Language Policy Dialogue Summit. The spread of English in India is an issue close to me – not only because I write in English, but I know the ability of this language to empower millions of young Indians and giving them access to opportunities in the globalized world.
The desire for English in the country is underestimated. English is not a trend, fad or an upmarket pursuit. English helps me face an interview, read the best academic books available and access the world offered by the Internet. Without English, progress for a middle class youth is heavily stunted. However, the state of English education and the attitude towards it leaves much to be desired.
Let me talk about the state first. There is a tiny minority of English speakers who are extraordinarily fluent in the language, probably more than most Britons. That tiny minority is also millions of people in a country as large as India, and is what will be visible to this group most of the time. These people had parents who spoke English, had access to good English medium schools – typically in big cities, and gained early proficiency, which enabled them to consume English products such as newspapers, books and films, thus increasing command over the language even further. I would say English is so instinctive to them that even some of their thought patterns are in English. These people, the E1s if I may call them, are much in demand. Irrespective of their graduation specialization, they can get a frontline job across various industries – hospitality, airlines, media, banking and marketing companies.
However, apart from the E1s, there are a large number of E2s, probably ten times the E1s, who are technically familiar with the language and even understand it. However, their skill in English communication is not at a professional level. If they sit in an interview conducted by E1s, they will come across as incompetent, even though they may be equally intelligent, creative or hardworking. They cannot comfortably read English newspapers, thus denied of a chance to keep upgrading their command of the language. English films and TV are not enjoyed by them and hence not consumed by them. English books are a non-starter. They know English but they have not been taught in a manner or are not in an environment that facilitates this virtuous cycle of continuous improvement through consumption of English products. Thus, while the difference in English level of an E1 and E2 may not be too different at age 10, by age 20 it is so stark that an E1 can get many jobs while an E2 won’t even be shortlisted. For lack of proper teaching, an entire world is closed to the E2s. After E2s, there are people who don’t have access to English at all. These people need to begin with basic learning. However, today I want you to focus on the E2s, as they are truly an amazing number of youth across the country that just need that extra push to take them to the next level and open opportunities for them.
Is this just a theory? Unfortunately no. I have given over fifty talks in the last eighteen months, at various colleges across the country. Many of these colleges are in smaller towns, places like Hisar, Raipur, Dehradun and Indore, to name a few recent ones. I’ve sat with the management of many of these colleges. I distinctly remember, an MBA college in Indore, which actually even has classes involving reading The Economist. The principal, an IIT graduate told me – “Chetan, my biggest concern, is that my students don’t know how to speak proper English. Sometimes I wonder, should I teach them Finance and Accounts, or should we just take basic English grammar classes. For come interview time, no matter how well they can analyze a company, they will not be comfortable putting a sentence together. What were their schools doing? And why should a postgraduate MBA college be doing this?”
That said, he hired ten teachers for his two hundred students for the sole job of teaching proper, MNC interview-ready English. My own books are simply written. One of the big uses of my books in small town India is that of using it as a tool to learn English. I was invited to a talk in Bastar, a backward area ten hours drive from the nearest airport of Raipur. I asked them who reads Chetan Bhagat in Bastar? They said tribal kids, they use your books to learn English. It shows you the hunger. For my recent book, we did a round of simplification editing, so that the book is more accessible to Indians. Of course, critics in India hate me for it. But that’s what critics do anyway, and if I am getting a chance to aid transforming a young person’s life, I am not going to pass up on that.
There is plenty of opportunity for BC here as well. There are sixty MBA colleges in Indore alone. There are a hundred and seventy five in the Delhi and NCR. A British Council program, to lift the E2s to E1s, not just teaching the ABCs will go a long way and the private MBA colleges will sign up for it in a heartbeat.
I talked about the state of English. I also talk about the second hindrance – the attitude to English. There are two kinds of attitudes again – there is of course some snobbery, something that comes with all things English. A section of people believe that English should be a high-class affair. Elitism and English are linked, and that has to be broken. I’ve tried to do that through my books, but have had to face a lot of heat because of it. You will too, especially if you do non-trendy activities like going out of Delhi, Mumbai and Bangalore. Programs will be harder to organize, and media coverage more difficult to get. However, that is where the action is. I don’t want to see British Council in the big cities. My wish is for British Council to percolate down to Tier II cities and towns, so that you can really make transformation happen. I know you are making change happen, and where ever you have touched local people, there has been a difference. Just do more of it. This is not Europe, where the British Council’s job is to spread English culture. No, you are not just spreading culture, you are transforming lives and changing them forever. And that’s way bigger than sponsoring Shakespeare’s plays. Push for grants, and people at the top, grant them.
The second attitude that causes difficulties is when English is seen as a threat to Hindi, or other local languages. I don’t think it is a threat at all. But that has to be communicated with sensitivity, and quite frankly going a little bit beyond the call of duty. Hindi and the local languages are neglected very badly in the country in terms of institutional support. There is no British Council equivalent to support them. When you go to a new place, you have to show you care for the people first, and care about English later. I am an English writer. However, the first newspaper column I started doing was in the biggest Hindi newspaper, and now I do it in an English newspaper as well. I was advised against it, as my image could take a beating. However, to reach my people and change their lives was far more important than my illusory image. The Hindi column started, it had a terrific response and the English newspapers automatically followed, and now I have a column with the Times of India as well. No harm to image. Similarly, British Council can help Hindi too. Who says you cannot? If you support Hindi, you will get a buy in from the cultural community in your cities. Don’t do debate competitions in English only, do them in Hindi as well. I’d say go as far as to have a Hindi cell. You know you are going to be in India, and to make a real difference, you need to be in touch with the Hindi speakers as well.
That’s all I have for now. I may have given too many suggestions, but I wanted to be specific and actionable in what I talk to you about. This is only because I really respect your organization, and if I may say it, treat it as my own. You guys are passionate, and get things done. And maybe that is why I feel you guys have it in you to make English reach across the country, and do what only this language can do in the world – make a difference.
—–
Aftereffect: Post the speech, several policymakers came up to me on their own. This included people from the NCERT, SCERTs and Education Department staff from Indian universities. They’ve invited me to come and give ideas on how our current teaching methods can be modified and updated to reflect modern times. I told them I will only come if people are open-minded and will be committed to change. Most agreed, and in the coming months, I will be sitting down with them to see what can be done. It will still be challenging given the rigid Indian system, but a start has to be made somewhere.
Love and Regards,
Chetan

PS: As always, your feedback is most welcome. Do let me know your thoughts. Will pass on any good suggestions to policymakers as well.


****

Monday, November 23, 2009

గొడ్డుమాంసం - ప్రజాస్వామిక స్థలాలు

ఇదివరకూ నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటన గురించి "గొడ్డుమాంసం - ఒక సంస్కృతి" అనే టపా రాశాను. ఎప్పటిలాగే పవిత్రమైన మిత్రులు బాధపడి విబేధిస్తే, ప్రజాస్వామిక మిత్రులు చర్చించి అంగీకరించారు. అదే ఘటన గురించి గుడిమేడ సాంబయ్య గారు South Asia Research లో భాగంగా Democratisation of the Public Sphere: The Beef Stall Case in Hyderabad's Sukoon Festival" అంటూ ఒక కేస్ స్టడీ రాస్తే దాన్ని SAGE publications వారు ప్రచురించారు. 

ఆ పేపర్ను మీరు ఈ లంకె ద్వారా చదవొచ్చు. 


ఆ ఘటనకు ప్రతిస్పందిస్తూ మిత్రుడు దిగుమర్తి సురేష్ కుమార్ రాసిన కవితను కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాను.

గొడ్డు మాంసం గొడ్డు మాంసం
బొడ్డు కోసినప్పటినుంచి తిన్న మాంసం
ఎముకలలో ఎముకై ఎగసిన మా మాంసం
రక్తంలో భాగమై దుమికిన మాంసం

ఊరికి దూరంగా నన్నుంచినపుడు
నా అడుగులే నీకంటరానివైనపుడు
మనిషినే మనిషిగా నువ్వు చూడలేనపుడు
నాకండగా ఉన్నది
నన్నీడికి చేర్చినది - గొడ్డు మాంసం

మా తాతాలు నేతులు తాగారని
ఏవేవో గొప్పలు చేశారని
నీ తరపున నువ్వేదో చెప్పుకుంటూ పోతుంటే
నా తరపున నిలబడ్డది
నాతోనే ఉన్నది - గొడ్డు మాంసం

రొమ్ము పిండి పాలు పిసికినపుడు
నీకు నెప్పంటే తెలియనే లేదు
చెప్పు కుట్టి తొక్కి నడచినపుడు
నీకు బాధంటే తెలియనే లేదు
నీ పెళ్ళికి... నీ చావుకి
డప్పై మోగినపుడు
దెబ్బంటే తగలనే లేదు
నా ఆకలిని తీర్చినపుడు
నీకు దేవతయ్యిందా గొడ్డు మాంసం?

****


Sunday, November 22, 2009

భాష - భావం

మనసులోని భావాలు బయటకొచ్చి భాషరూపం సంతరించుకుంటేతప్ప అప్పుడప్పుడూ మనకే తెలియవు. ఒక్కోసారి సంభాషణల్లో, మరోసారి  రాతల్లో మనం మనకు ఎరుక అవుతుంటాం. అంతవరకూ మనలో ఉన్న చిత్రమైన ఆలోచనలూ,భావాలూ,స్పందనలూ,ప్రతిస్పందనలూ కొత్తగా మనకే పరిచయమౌతుంటాయి. 


****

Friday, November 13, 2009

వరద వార్త




పేపరు తడిగా ఉందెందుకో!
పేపరోడు నీళ్ళలో పారేసిపోయాడా?
లేదే!
వరదొచ్చి వందగ్రామాలు మునిగిపోయాయట
బహుశా ఆవార్తను మోసుకొచ్చిందేమో.

(గుల్జార్ కవితలోని కొన్ని పంక్తుల స్పూర్తితో) 

****

Thursday, November 5, 2009

ఎవరికి ఏహక్కుంది: ఒక కుట్ర


మహిళల హక్కులకోసం పోరాడాలంటే మహిళే అయ్యుండఖ్ఖరలేదు. ఫెమినిస్టు అంతకన్నా అయ్యుండఖ్ఖరలేదు. మనిషైతే చాలు. దళితసమస్యని తీర్చడానికి పోరాటం దళితులే చెయ్యనఖ్ఖరలేదు. నిజానికి ఎందరో దళితేతరుల కృషి లేకపోతే దళిత ఉద్యమమే లేదు. కాబట్టి ఇక్కడా అది చెల్లదు. 

కానీ...తెలుగు భాషలో నిర్బంధ విద్య కావాలి అని కోరుకునేవాళ్ళు తమ పిల్లల్ని తెలుగు మీడియంలో చేర్పించకపోయినా, కనీసం చేర్పించిన స్కూళ్ళలో తెలుగు కోసం శ్రమించినవాళ్ళో,వాదించినవాళ్ళో లేక పేరెంట్స్ కమిటీలో ప్రస్తావించినవాళ్ళో ఉండాలనుకోవడంలో తప్పులేదని నా ఉద్దేశం. ఎందుకంటే, తమ పరిధిలోనే తెలుగు కోసం పోరాడని ఈ సాహసవంతులు ఉద్యమాలు చేసి ప్రభుత్వాల్ని మారుస్తామంటే నమ్మడానికి చెవిలోపూలు పెట్టుకున్నవాళ్ళు బ్లాగుల్లో కొందరున్నా, అందరూ అలా ఉండరని చెప్పడానికి ఆమాత్రం ప్రశ్నించక తప్పదు.

ప్రాధమిక విద్యలో తెలుగు తగ్గిపోతుందనడానికి శాస్త్రీయమైన ఆధారాలు ఎక్కడా లేవు. సంఖ్యాపరంగా ఈ వాదం ఎక్కడా నిలబడదు. 2005-06 లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో మొత్తం 50,895 ప్రాధమిక పాఠశాలలున్నాయి.విధ్యార్థుల సంఖ్య 30,84,212. ప్రైవేటు పాఠశాలల్లో కేవలం 3,570. విద్యార్థలు 6,03,160. ప్రభుత్వపాఠశాలల్లో తెలుగులోనే బోధిస్తారనేది అందరికీ తెలిసిందే. ప్రాధమికోన్నత విద్యలో కూడా పరిస్థితిలో పెద్ద మార్పు లేదు. అలాంటప్పుడు ప్రభుత్వం ఏదో కుట్రచేసి తెలుగును చంపేస్తుందనటం తెలియనితనం. ప్రభుత్వం తన ముస్లిం appeasement కోసం తెలుగుని పట్టించుకోవటం లేదనడం మూర్ఖత్వం. ఉర్దూ చదివిన ముస్లింలు పాకీస్తానీలు అయిపోయి శతృవర్గంగా తయారవుతారనడం ఉన్మాదం.

తెలుగు భాష కోసం మొత్తుకుంటున్న మేధావుల పిల్లలెవరూ తెలుగు మీడియం చదువులు చదవటం లేదు. వీళ్ళు ప్రభుత్వం మీదపడి స్టేజిల్లోనూ,బ్లాగుల్లోనూ ఏడవటంతప్ప క్రియాశీలకంగా తెలుగును ఒక ప్రజాఉద్యమంగా ఎన్నడూ చెయ్యాలనుకోలేదు.ఎందుకంటే,ఒక్కసారి ప్రజల్లో పడితే వీళ్ళబ్రతుకులు కుక్కలుచింపిన విస్తరే. "మీకు మాత్రం ఇంగ్లీషు చదువులూ మాకు మాత్రం తెలుగు బ్రతుకులా" అని ప్రజలు అడిగితే వీళ్ళు మొఖం ఎక్కడబెట్టుకుంటారో వీళ్ళకే తెలీదు.

ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం,ప్రజాఉద్యమాలకున్న ప్రాధాన్యత మీకు తెలియంది కాదు. సరిగ్గా ఈ పరిస్థితినే రాష్ట్రప్రభుత్వం తన ఆర్ధిక పరిస్థితిని చక్కబెట్టుకోవడానికి వాడుకుంటోంది. పాఠశాల విద్యను 6-12 వరకూ చేసి ఇంగ్లీషు-హిందీ చేస్తే కేంద్రప్రభుత్వం తేరగా నిధులిస్తుంది.రాష్ట్రప్రభుత్వం తన సొంత నిధులు విద్యాశాఖలు కేటాయించాల్సిన పనిలేదు. ప్రాధమిక విద్య ఎలాగూ SSA (సర్వశిక్షా అభియాన్) పుణ్యమా అని కేంద్రం నిధులతో గడిచిపోతోంది. పాఠశాల విద్యకూడా ఒదిలిపోతే ఒకపనైపోతుందనేది ప్రభుత్వ విధానం.

ఈ తెలుగు భాషా ‘బాధ’కులకు మిగిలింది మూడు options. ఒకటి భాషాబోధనను మార్చడం. అది వాళ్ళు చచ్చినా చెయ్యరు. ఎందుకంటే అదే "అచ్చతెలుగు" అనేది వీళ్ళ పిచ్చినమ్మకం. భాషా వారసత్వం వీరికి ముఖ్యం. భాష కాదు. వీరికి వర్తమానంకన్నా భూతకాలపు వైభవం ముఖ్యం.ప్రజల తెలుగుకన్నా, సారస్వతం ముఖ్యం.

రెండోది. ఏ ఆర్థిక కారణాల వల్లనైతే ప్రభుత్వం ఇంగ్లీషుమీడియం చదువులవైపు మొగ్గుచూపతోందో ఆ ఆర్ధిక కారణాన్ని రూపుమాపడం. స్వచ్చందంగా "భాషా సెస్" విధించమని ప్రభుత్వానికి చెప్పి,తెలుగు భాషా పరిరక్షణకోసం ట్యాక్స్ కట్టడానికి తయారవ్వడం. ఈ పని వీళ్ళు చేస్తారని నాకు అస్సలు నమ్మకం లేదు. ఏదో తెలుగు భాషకోసం lip service వరకూ చేస్తారుగానీ జేబులోంచీ డబ్బుతీసి తెలుగు భాషను రక్షించడమంటే..హమ్మో!

మూడొది. తెలుగు భాషను ఒక రాజకీయ ఉద్యమం చెయ్యడం. అన్ని రాజకీయపార్టీల మ్యానిఫెస్టోలోనూ తెలుగు భాషను "రక్షించే"(what ever it means to them)విధంగా చర్యలు ప్రతిపాదింపజెయ్యడం. అధికారంలోకి వచ్చిన తరువాత అమలు పరిచేలా ఒత్తిడి తేవడం. లోక్ సత్తా లాంటి స్థానిక పరిపాలన తెలుగులో జరగాలని కోరుకునే పార్టీల నెత్తిన తమ ఆభిజాత్యాల్ని రుద్ధకుండా, పరిపాలనా తెలుగును సర్వత్రా ఉపయోగించేలా చర్యలు తీసుకుంటూ స్వచ్చందంగా దానికోసం పాటుపడటం.

పైవేవీ ఈ పెద్దలు చెయ్యరు చెయ్యలేరు...ఎందుకంటే వీళ్ళ ముఖ్య ఉద్దేశం తెలుగు భాష బ్రతకడం కాదు, తెలుగుతప్ప మరేదీ చదువుకోలేని ఒక తరగతి ప్రజల్ని మరో యాభైసంవత్సరాలు ఈ గొప్పోళ్ళకు వాళ్ళవారసులకూ పోటీరాకుండా చెయ్యడం. అందుకే తెలుగు భాష గురించి emotional rhetoric మాట్లాడతారేగానీ,విద్యాప్రమాణాల గురించి మాట్లాడరు. ప్రభుత్వం తెలుగు కోసం ఏదో చెయ్యలంటారుగానీ, వీళ్ళు మాత్రం ప్రైవేటు విద్యకు మహారాజపోషకులు. అందరూ నిర్భంధ తెలుగు విద్య అభ్యసించాలంటారుగానీ,వీళ్ళ పిల్లలు మాత్రం కాన్వెంటుల్లో రాజ్యమేలుతుంటారు. They are the most dangerous people at this point in time. Beware of them.


భాష - మతం: దీనిభావమేమి తిరుమలేశా!



ఒక స్కూల్లో ఇంగ్లీషు పలక పిల్లల మెడలో వేసిన మరుక్షణం ఆ స్కూలు క్రిస్టియన్ మిషనరీలది కాబట్టి దీనికొక మతకోణం ఆపాదించబడుతుందని అనుకున్నాను. అటూఇటూగా అది జరిగినా, సహజంగా మన మతవాదుల గురి విషయం మీదకాక వారి "వాదాల" మీద ఉంటుంది కాబట్టి, అది కాస్తా ప్రభుత్వ మైనారిటీ విద్యా విధానం పై, ఉర్దూ మీడియంలపై, ముస్లింల పైకి వెళ్ళిపోయింది. "భాషకు మతం రంగేమిటయ్యా బాబూ!" అంటే,"వ్యాఖ్యలోని భావాన్ని వక్రీకరిస్తున్నారు" అంటున్నారు ‘పొద్దు’ వారు. కాబట్టి మీరే ఈ వ్యాఖ్యలకు అర్థాల్ని చెప్పండి. 
“మీరు ముస్లిములు, కాబట్టి మీరు ఉర్దూవాళ్లు” అని ఈ ప్రభుత్వమే వాళ్ళకి బళ్లు పెట్టి మఱీ ఉర్దూ నేర్పిస్తున్నది. అలా వాళ్ళని ఇండియాలో పాకిస్తానీలుగా మారుస్తున్నది. ఇలా ఉర్దూబళ్ళు పెట్టి జాతిలో ఇంకో ఉపజాతిని, చెవిలో జోఱీగలాంటి శత్రువర్గాన్ని తయారు చేసుకోవడం మనకి అర్జెంటా ?” దీని భావమేమి తిరుమలేశా????????
““తెలుగుని తప్పనిసరి చెయ్య” మని అడిగినప్పుడల్లా “అమ్మో ముస్లిములేనైనా అనుకుంటా”రంటూ ఎందుకు కుంటిసాకులు చెబుతుందో నాకు తెలియదు. కానీ ఈ కుట్ర ఇంకెంతకాలం ? ” దీని అర్థమేమి శ్రీనివాసా?????
ముస్లింలు తెలుగును ఎప్పుడు వ్యతిరేకించారు? ముస్లింలు ఉర్ధూనేర్చుకుంటే పాకిస్తానీలు అయిపోతారా? ప్రభుత్వం తెలుగుకన్నా ఉర్ధూకు ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చింది? తెలుగు మాధ్యమాన్ని ప్రమోట్ చెయ్యకపోవడానికి ముస్లింల నిరసన కారణం అని ప్రభుత్వం ఎప్పుడైనా చెప్పిందా? మరి ఏమిటీ విపరీతం!!! ఎవరిమీద ఈ కోపం!!! ఎందుకీ కుట్ర???
50,895 ప్రాధమిక పాఠశాలలు 30,84,212 తెలుగు మీడియం విద్యార్థులున్న ఈ రాష్ట్రంలో, పాఠశాలల్లో/ప్రాధమిక విద్యలో తెలుగు మృగ్యమయ్యే ప్రమాదం నిజంగా ఉందా?  తమ పిల్లల్ని మాత్రం ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో చేర్పించిన ఈ కుహానా మేధావులు పడుతున్న బాధ దేనిగురించి?
**** 

Saturday, October 31, 2009

తెలుగుకన్నా...పిల్లల హక్కులు ముఖ్యం


మళ్ళీ తెలుగు భాష చర్చల్లోకి వచ్చేసింది. అవకాశం కోసం ఆశగా చూసే తెలుగు వీరులు బ్లాగుల్లో వీరంగాలు మొదలెట్టేసారు. తెలుగు భాషా ప్రశస్త్యం, ఘనతల్ని ఏకరువుపెడుతున్నారు.ప్రస్తుత పరిస్థితి మీద దీర్ఘమైన వ్యాసాలలో నిట్టూర్పు విడుస్తున్నారు. సందులో సందుగా ఇష్యూ లేక సైలెంట్ అయిపోయిన తెలంగాణా వా(బా)దులు ‘తెలుగు వయా తెలుగుతల్లి వయా తెలంగాణాతల్లి’ అనే రాంగ్ రూటొకటి కనిపెట్టి మళ్ళీ అర్థరహితవాదనల్ని అరంగేట్రం చేయించారు. ఈ గోల మధ్య అసలు గోడు పక్కదారిపట్టింది.

అది పిల్లల హక్కులకు సంబంధించింది. చిన్నపిల్లల సున్నిత హృదయాలకు సంబంధించింది. భాషకన్నా నాకు ఆ పిల్లోళ్ళ బాధ ముఖ్యం. వారు అనుభవించిన మానసిక వేదనకు న్యాయం చెయ్యడం ముఖ్యం. నవోదయా విద్యాలయాలో చదువుతున్నప్పుడు మాకు three language formula ఉండేది. వారంలోని ఆరు రోజుల్లో రెండేసి రోజులు తెలుగు, రెండ్రోజులు హిందీ మరో రెండు రోజులు దినసరి వ్యవహారాలలో ఇంగ్లీషు భాషాప్రయోగం చెయ్యడాన్ని ప్రోత్సహించేవారు. ఆ రోజులో ప్రార్థన మొదలు రాత్రి స్టడీ అవర్స్ ఆఖరి ఘడియ వరకూ ఈ విధానం అమలయ్యేలా మానిటరింగ్ జరిగేది. చిన్నచిన్న పనిష్మెంట్లు,జరిమానాలూ సాధారణం. కానీ ఇలాంటి శిక్షలూ, అవమానాలూ ఉండేవి కాదు.

ఈ ఫోటో పేపర్లో చూడగానే నాకొచ్చింది ఆ వ్యవస్థపై కోపం. ఇంగ్లీషు "మాత్రమే" నేర్పించాలనే తల్లిదండ్రుల పట్టుదలలపై చిరాకు. ఈ విధానాన్ని విజయవంతంగా అమలుచేస్తూ,reinforce చేస్తున్న టీచర్లు,స్కూళ్ళపై నిరసన. అంతకన్నా మించింది ‘ఆ పిల్లల హృదయాలకు తగిలిన గాయం ఎలా మానుతుందా’ అనే వేదన. 

తెలుగు భాష తన బలహీనతల మూలంగానో, పరిస్థితుల ప్రభావం వల్లనో, పాలకుల చేతకానితనం మూలంగానో,తెలుగోళ్ళ ఇంగ్లీషు మోజు కారణంగా బలైనా నాకు పెద్ద తెడాలేదు. కానీ పిల్లల్ని ఇలా మానసిక వేదనకు గురిచేసే హక్కు ఎవరికీ లేదు. చివరికి తల్లిదండ్రులకు కూడా ఆ అధికారం లేదు. Its a gross violation of child rights. అందుకే స్కూలుపై,టీచర్లపై తక్షణం చట్టపరమైన చర్య తీసుకోవాలి.  

*****

Friday, October 23, 2009

మునెమ్మ - A manifesto on the Feminine


డాక్టర్ కేశవరెడ్డి గారి ‘మునెమ్మ’ అటుపాఠకుల్నీ ఇటు విమర్శకుల్నీ ఒక పట్టాన వదిలే నవలైతే కాదనే నిజానికి, నవల విడుదలైన సంవత్సరం తరువాత కూడా జరుగుతున్న చర్చలూ,వ్యాసాల పరంపరలు,కొనసాగుతున్న ఆలోచనలే సాక్ష్యం. ఆ నవలను కొందరు మ్యాజిక్ రియలిజంగా అభివర్ణించి-పొయటిక్ జస్టిస్ ని కొనియాడితే, మరికొందరు అరాకొరా మానసిక విశ్లేషణ చేసి, మోరలిస్టిక్ జడ్జిమెంట్లు రాసిపారేశారు. నా ప్రయత్నంగా నేను ‘నేటివ్ రీడర్’ ధృక్కోణం నుంచీ నవలని స్థానికసాంప్రదాయాల ఫోక్లోర్ ట్రెడిషన్ పంధాను ఆవిష్కరించే అసంపూర్ణ ప్రయత్నం(నా వ్యాసం పూర్తి కాలేదుమరి!) చేశాను.


మునెమ్మ నవల అందులోని పాత్రల మార్మికత,కథ లోని గాథాత్మకత దృష్ట్యా ఒక మనోవైజ్ఞానిక నవల అనేది నిర్వివాదాంశం. కానీ, ప్రాచిన- మానవమౌళిక( primitive and primordial) భావనలైన లైంగికతను మోరలిస్టిక్ దృష్టితో చూసే పురుషభావజాలం కోణం నుంచీ అర్థం చేసుకునే ప్రస్తుతపోకడలలో ఒక objective analysis ఈ నవలపై జరగలేదు అనేది నా నమ్మకం. ‘మునెమ్మ’ కేశవరెడ్డి పైత్యానికి ప్రతీకగా సాక్షి పేపర్లో కాత్యాయని విరుచుకుపడ్డా, కొందరు సాహితీ మిత్రులు ఆవిడ అర్బన్-ఎలీటిస్ట్- మిస్ ఇంటర్ప్రిటేషన్ కు సాగిలపడ్డా, అదంతా అనలిటికల్ సైకాలజీలోని నవీనపోకడలు (ముఖ్యంగా కార్ల్ యంగ్)- సాహిత్యంలో ఆ పోకడల్ని అన్వయించడం తెలియకపోవడమే అనే నిజాన్ని బహుచక్కగా వివరించిన వ్యాసం పసుపులేటి పూర్ణచంద్రరావు గారు ద సండే ఇండియన్ (19th Oct,2009)లో రాసిన "మునెమ్మ - ఒక ‘ఫండమెంటల్’ కథ! : A manifesto on the Feminine" అనే వ్యాసం.


ఆ వ్యాసం లంకెను ఇక్కడ ఇస్తున్నాను (పేజి నెంబర్ 42- 47). చదివి మీ అభిప్రాయాల్ని తెలిపితే, చర్చ ఇక్కడా ప్రారంభించొచ్చు.


****

Thursday, October 22, 2009

ప్రేమ వైరుధ్యం


ప్రేమ కోసం...
జీవితాంతం ఎదురుచూస్తాం.
ఎవరైనా ప్రేమిస్తే...
అనుమానంతో వేధిస్తాం.
అంగీకరించక మారాంచేస్తాం.

****

Wednesday, October 14, 2009

ఆధునికోత్తరవాదం : Post-modernism




"Post-modernism is not an ideology. Its an 'idea' of demystifying all ideologies at the strength of independent thinking" అని మా ఆంగ్లసాహిత్యం ఫ్రొఫెసర్ చెప్పేవారు.అప్పట్లో కొంత అర్థమయ్యిందనిపించినా,ఇప్పటికీ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను.

"ఒక సిద్ధాంతానికి కాని, ఒక నియమానికి కాని, ఒక వాదానికి గాని, ఒక సంప్రదాయానికి కాని కట్టుబడి ఉండకుండా, స్వతంత్రంగా ఆలోచించి, సందర్భశుద్ధి తో తమ తమ భావాలని నిర్భయంగా వ్యక్త పరచటమే ఉత్తర అధునాతన తత్వం". ఇలా ఉంటే ‘మీ మాటల్లో పొంతనలేదు’ అన్న వ్యాఖ్యలు వినాల్సివస్తుంది. అలాంటప్పుడు గ్రహించాల్సింది ఏమిటంటే, seeking nobody's approval and disapproving no one's idea of what you are  is also part of post- modernism.



****

Monday, October 12, 2009

అర్థం-ఆనందం : జీవితం


ఆనందకరమైన జీవితానికీ అర్థవంతమైన జీవితానికీ చాలా తేడా ఉంది.

ఆనందం ఆ క్షణమైతే చాలు. ఆ క్షణంలో అనుభవిస్తేచాలు. అలాగే ప్రతిక్షణాన్నీ అనుభవిస్తూపోతే జీవితమంతా ఆనందమే.
కానీ...అర్థవంతమైన జీవితంకావాలంటే?
ఒక మనిషి జీవితంలోని భూత-భవిష్యత్-వర్తమానాల అంచనా కావాలి.
ఆశలు,ఆశయాలు,కలలు,రహస్యాలు, అనుభవాలసారాలు కావాలి.
భూతకాలపు చీకటికోణాల్ని - వర్తమానపు ఆశల ఊహల్ని అన్నింటినీ ఒక క్షణం జీవించి సొంతం చేసుకోవాలి.

మరి ఆనందకరమైన జీవితం కావాలా...అర్థవంతమైన జీవితం కావాలా?
నిర్ణయం ఎప్పుడూ...మనదే!

****

Thursday, October 1, 2009

నిజం - అబద్ధం: ఒక నిర్వచనం


వస్తువులు మన ఎదురుగా బౌతికంగా ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు. కాబట్టి బౌతికవస్తు పరిజ్ఞానానికి ఎటువంటి వ్యతిరేక భావనా లేక వైరుధ్యం ఉండవు. కానీ మన "నిజాల" జ్ఞానానికి ", "అబద్ధం" అనే వ్యతిరేకపదం ఎప్పుడూ వెన్నంటినే ఉంటుంది. అందుకే నిజాల భావనలో వైరుధ్యాలు సహజం. అలాగే అబద్ధాల్లో కూడా వైరుధ్యం అంతే సహజంగా ఏర్పడుతుంది. ఎందుకంటే, నిజం-అబద్ధం అనేవి "నమ్మకం" ఆధారంగా ఏర్పడతాయి. కాబట్టి నిజాన్ని అబద్ధంగానూ,అబద్ధాన్ని నిజంగానూ కూడా ఈజీగా నమ్మొచ్చు. ఒక్కోసారి అబద్ధాల్ని మరింత బలీయంగా నమ్మెయ్యొచ్చు. కాబట్టి నమ్మకాల నిజానిజాల్ని సమీక్షించుకోవడం అత్యంత కష్టం. అంతకన్నా క్లిష్టమైన సమస్య ఏమిటంటే... నిజాన్నీ అబద్ధాన్నీ నిర్వచించడం.


ఎవరైనా నిర్వచించడానికి ప్రయత్నించండి మరి!


****

పదునున్నా గురిలేని ‘బాణం’


“వ్యవస్థలో ఉంటూనే దానిలో మార్పు తీసుకురావాలా లేక వ్యవస్థలోని (ఫ్యూడలిజం,పోలీస్ దుండగాలు వంటి) లోపాలకు వ్యతిరేకంగా సాయుధపోరాటం (నక్సలిజం) చెయ్యాలా?” అనే ప్రశ్నకు ఖరాఖండిగా తేల్చిచెప్పగలిగే సమాధానం ఇప్పటికీ ఉండకపోవచ్చు. కానీ పరిణామక్రమంలో, హింసను ప్రేరేపించే ఏ విధానమైనా, ప్రాణహాని కల్పించే ఏ ఆలోచనా ధోరణైనా ఒకవైపు ప్రజాస్వామ్యానికి మరోవైపు మానవత్వానికీ గొడ్డలిపెట్టనే భావన స్థిరపడింది. ఇలాంటి సైద్ధాంతిక నేపధ్యాన్ని సినిమా కోసం ఎంచుకున్నప్పుడు కొంత ఆలోచన,మరికొంత అవగాహన, మరింత స్థితప్రజ్ఞత కథకుడికి,దర్శకుడికి కావాలి. చివరికి ఏంచెప్పాలనుకున్నాడో దానిమీద conviction కావాలి. “బాణం” సినిమాలో అవి లోపించాయి. అందుకే పదునువున్నా గమ్యం లేక, దారితెలీక గురిలేకుండా మిగిలింది.

ఏ కారణంచేతో అర్థంకాదుగానీ, ఈ సినిమా కథ 1989 సంవత్సరంలో జరుగుతుంది. వ్యవస్థను లోపలినుంచే మార్చడానికి పోలీస్ ఆఫీసర్ కావాలనుకునే ఒక మాజీనక్సలైట్ కొడుకు ‘భగత్’ (నారా రోహిత్). తండ్రి (షయాజీ షిండే) మంచి కోసం ఉద్యమంలో ఉన్నాడని నమ్ముతూనే, తండ్రి విధానాలతో విబేధించే ఆదర్శవాది. ఒక దృశ్యంలో ఏకంగా “నేను మానాన్న లాగా తప్పు చెయ్యను” అని చెప్పగలిగే సిద్ధాంతకర్త. మరోవైపు మరణశయ్యమీదున్న తండ్రినే చంపే ఒక ఫ్యూడల్/మాఫియా యువనాయకుడు ‘శక్తి సాహు’(రణధీర్). ఫ్యూడలిజాన్ని,రౌడీయిజాన్ని రాజకీయంగా మలుచుకుంటేనే వ్యవస్థమీద పట్టు సాధించగలమనే విజన్ కలిగిన విలన్. ఈ రెండు విపరీత శక్తుల ఘర్షణ ఈ సినిమా కథకు మూలం. చివరికి హీరో ఆదర్శం-నమ్మకం గెలుస్తాయా లేక తన ధృక్పధంలో ఏమైనా మార్పులు వస్తాయా? చివరికి ఏంజరుగుతుంది అనేది కథ.

కథకున్న పరిధి చాలా ఉన్నతం. కథలో చర్చించాలనుకున్న విషయం ముదావహం. అయితే కథనంలోని లోపాలు,హీరోపాత్ర ఎదుగుదల క్రమంలోని పేలవత్వం, అత్యంత నీరసమైన ఎడిటింగ్ కలగలిపి, ఉద్దేశం మంచిదైనా కేవలం ఒక మంచి ప్రయత్నంగా మాత్రమే అభినందించదగ్గ సినిమాగా బాణం మిగిలింది.

బరువైన భగత్ పాత్రలో కొత్త నటుడు నారా రోహిత్ నటించడానికి బాగానే ప్రయత్నించాడు. కానీ పాత్రలోని పరిణితి నటనలో లేకపోవడంతో తన పాత్రలోని స్థిరత్వాన్ని, భావగాంభీర్యాన్ని ప్రదర్శించే విషయంలో చాలాసార్లు ఆసక్తిలేనట్లుగా అనిపించే (రోజా సినిమాలో అరవింద్ స్వామి లాంటి) తన భావప్రకటన పంటికిందరాయిలా అనిపిస్తుంది. రోహిత్ కున్న పెద్ద ప్లస్ అతడి వాచకం. కొంచెం నీరసంగా అనిపించినా స్పష్టంగా తెలుగు మాట్లాడగలడు. గొంతు బాగుంది. మాజీనక్సలైట్ గా షయాజి షిండే పాత్ర కొంత అస్తవ్యస్థంగా ఉన్నా, నటనతో దాన్ని సమర్ధవంతంగా కప్పిపుచ్చగలిగాడు. వరకట్నం, అత్తింటి దౌష్ట్యం, భర్తచేతకానితనం, తండ్రి అకాలమరణం వలన అనాధగా మిగిలే సుబ్బలక్ష్మి పాత్రలో నూతన నటి వేదిక ప్రాత్రోచితమైన ఆహార్యంతో సరిపోయింది. హీరోయిన్ పాత్రకు గాత్రదాతగా గాయని సునీత కృషికూడా ఈ పాత్రను పండించడానికి యధావిధి ఉపయోగపడింది. చాలా మంది కొత్త ముఖాలు కనిపించే ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన రణధీర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

సినిమాలో ఉన్న పెద్ద లోపం ఏ ఆదర్శంకోసమైతే హీరో సినిమా మొత్తం పోరాడతాడో చివరకి అదే ఆదర్శాన్ని తుంగలోతొక్కి విలన్ “సమస్య”ని చట్టబద్ధంగా అనిచెబుతూనే చట్టాన్ని చేతుల్లోకితీసుకుని “తీర్చెయ్యడం”. దానితోపాటూ, హీరోకీ విలన్ కీ మధ్య సరైన direct conflict లేకపోవడం. ఈ సమస్యల్ని మరింత గాఎత్తిచూపేది, చాలా ఆకర్షనీయమైన విలన్ పాత్ర రూపకల్పన. విలన్ శక్తిసాహు వ్యక్తిత్వం,ఆదర్శం నీచమే అయినా, దానిలో అతను చూపే నమ్మకం, తాత్వికత ప్రేక్షకుల్ని ఆ పాత్రని గౌరవించేలా చేస్తాయి. ఆ పాత్రపలికే కొన్ని సంభాషణలు ఎంత intellectual గా ఉంటాయంటే, వాటికి ధియేటర్లో చప్పట్లు తప్పవు. అలాంటి విలన్ ని హీరో సినిమా మొత్తం చెప్పే ఆదర్శాల్ని మంటగలిపి తరిమితరిమి కొడుతుంటే, (అ)సహజంగా సానుభూతి విలన్ మీదకెళ్ళి హీరో హీరోయిజం కృతకంగా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగంలో అనిల్ భండారి సినెమాటోగ్రఫీ సినిమాకి చాలా సహాయం చేస్తే, ఎడిటింగ్ సినిమా గమనాన్ని దెబ్బతీసి ప్రేక్షకుల్ని విసిగిస్తుంది. ఈ సినిమాలో దాదాపు ప్రతిషాట్ నిడివినీ తగ్గించొచ్చని చెబితే ఆశ్చర్యపోనక్కరలేదు. మార్తాండ్ కె.వెంకట్ లాంటి సీనియర్ ఎడిటర్ ఇలా చెయ్యడం అర్థంకాని విషయం. లేదా తప్పు మొదటి సారిగా దర్శకత్వం వహించిన దంతులూరి చైతన్య దయినా అయ్యుండాలనిపిస్తుంది. మంచి పోరాటదృశ్యాల్లోకూడా షాట్ల నిడివి గమనిస్తే ఎడిటర్ కు దర్శకుడికీ మధ్య అస్సలు సమన్వయం కుదరలేదనే విషయం తేటతెల్లమవుతుంది.

గంధం నాగరాజు మాటలు కొన్ని సహజంగానూ, మరికొన్ని కొటేషన్లు ఏరుకొచ్చి ఇరికించినట్లుగానూ, మరికొన్ని పాత్రలకు వన్నెతెచ్చేవిగానూ ఉన్నాయి. శ్రమకోర్చి, ఆలోచించి రాసారన్న నిజం “వినిపిస్తుంది”. ఆ శ్రమ అభినందనీయం. మణిశర్మ సంగీతం పాటల్లో పండితే, అనవసరంగా వచ్చే నేపధ్యసంగీతం కటువుగా ఉంటుంది. లిప్ సింక్ లేకుండా అన్నీ నేపధ్యగేయాలే ఉండటం ఒకపెద్ద రిలీఫ్. ప్రత్యేకత కోసం ప్రదమార్థంలో పోరాటదృశ్యాలు తెరపైన చూపించకుండా కేవలం జరిగిన భావనని కలిగించడం సినిమాలోని రక్తపాతం శాతాన్ని తగ్గించినా, ఎందుకో నవ్వొచ్చింది (ముఖ్యంగా రైల్వేస్టేషన్ పోరాటం)గానీ, ఆ “ప్రత్యేకత”ని ఆస్వాదించలేని పరిస్థితి కలిగింది.

మెగానిర్మాత ఆశ్వనీదత్ భారీతన వారసత్వాన్ని వీడి, కుమార్తె ప్రియాంక నిర్మించిన ఈ చిరుచిత్రం ఒక నవీనపోకడగా అభినందనీయం. కానీ కథనం,పాత్రపోషణ మీద అవగాహనలేకుండా సాగిన ఈ ప్రయత్నం కొంత నిరాశని కల్పించిందని మాత్రం చెప్పక తప్పదు. దర్శకుడు చైతన్య ప్రధమ యత్నంగా ఇలాంటి కథను ఎన్నుకోవడం సాహసంగా ఒప్పుకున్నా, ఆ సాహసానికి సార్థకత చేకూర్చలేకపోయాడని ఒప్పుకోక తప్పదు.

మళ్ళీ చాలా రోజులకు తెలుగులో ఒక సిన్సియర్ సినిమా తీసే ప్రయత్నం జరిగిందని ఈ సినిమా చూడమని రెకమండ్ చెయ్యాలా లేక నిరాశపరిచిందని వెళ్ళొద్దని చెప్పాలా తెలీని పరిస్థితిలో ‘బాణం’ నిలిపింది. అందుకే పదునున్నా ఈ బాణానికి గురిలేదు అని సర్ధుకోక తప్పదు.


******

Wednesday, September 30, 2009

వింత కలయికల ‘తడి’- ఈరమ్ (తమిళ్)


ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మాణ సంస్థ ‘S picture‘ వైవిధ్యానికి పట్టంగట్టే నిర్మాణసంస్థగా మంచి గుర్తింపు పొందింది. ఈ సంస్థ నూతన చిత్రం, ‘అరివళగన్‘ దర్శకత్వం వహించిన “ఈరమ్“. ఈరమ్ అంటే తెలుగులో తడి లేదా చమ్మ అని అర్థం.

ఒక అపార్ట్మెంట్ బిల్డింగులో రమ్య(సింధు మీనన్) అనే గృహిణి బాత్ టబ్ లో మునిగి చనిపోతుంది. అది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీస్ పరిశోధన ప్రారంభమవుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ రమ్య ఒకప్పుడు ప్రేమించిన వాసుదేవన్ (ఆది). రమ్య సూసైడ్ నోట్ లభించడం, చుట్టుపక్కల ఫ్లాట్ వాళ్ళ సాక్ష్యాల ఆధారంగా పోలీసులు రమ్య చావునొక ఆత్మహత్యగా నిర్ణయిస్తారు. కానీ రమ్య వ్యక్తిత్వం తెలిసిన వాసుదేవన్ కు అది ఆత్మహత్య అని నమ్మబుద్ది కాదు. ఒక మిత్రుడి సహాయంతో సొంతంగా తనే ఇన్వెస్టిగేట్ చెయ్యడం మొదలెడతాడు. అదే సమయంలో ఆ అపార్ట్మెంట్ లో రమ్యతో పరిచయమున్న ఒక్కొక్కరూ చంపబడ్డం మొదలౌతుంది. ఈ అందరి చావులోనూ ఉపయోగపడిన ఆయుధం …నీళ్ళు…తడి.

రమ్య ఎందుకు చనిపోయింది? రమ్య చావుకీ ఈ చావులకీ మధ్యనున్న సంబంధం ఏమిటి? వాసు ఈ రహస్యాన్ని బేధిస్తాడా అనేది మిగతా కథ.

ఈ మధ్యనే నవతరంగంలో సినిమాల మూసల (Genre – జాన్రా) గురించి చర్చలు జరిగాయి. ఆ నేపధ్యంలో చూసుకుంటే, ఈ సినిమాని మర్డర్ మిస్టరీతో మొదలై హృద్యమైన ప్రేమకథగా రూపాంతరం చెంది, హఠాత్తుగా మానవాతీతశక్తుల సినిమాగా పరిణితిచెందే ఒక ధిల్లర్ అనుకోవచ్చు. ఇన్ని మూసలు కలిపిన మసాలా మిక్స్ లాగా అనిపించినా, అన్ని మూసల్నీ సరైనపాళ్ళలో కలిపి కన్విన్సింగా చెప్పగలగటం వలన ఒక మంచి సినిమాగా తయారయ్యింది.ముఖ్యంగా హారర్ ఎలిమెంట్ ని ధ్రిల్లర్ పంథాలో నడిపి, ఎక్కడా జుగుప్స కలగకుండా దర్శకుడు చూపించిన విధానం అభినందనీయం.

Tamil-Movie-Eeram-Stills-05భద్రాచలం లాంటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సింధు మీనన్ (చందమామ ఫేమ్), రమ్యపాత్రలో చాలా మంచి నటన కనబరిచింది. చాలా అందంగా కూడా కనిపించింది. ‘మృగం’ చిత్రంలో తన భీకరమైన నటన కనబరిచిన ఆది(దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు) చాలా అండర్ ప్లే ఉన్న వాసుదేవన్ పాత్రలో రాణించాడు. మంచి భవిష్యత్తు ఉన్న నటుడిగా తనని తాను నిరూపించుకున్నాడు. రమ్య భర్త ‘బాల’గా నందా నటన ఆకట్టుకుంటుంది. రమ్య చెల్లెలిగా శరణ్య మోహన్ పాత్రోచితంగా నటించింది. ముఖ్యంగా రమ్య తనని ఆవహించినప్పుడు చేసిన నటనని మెచ్చుకోవచ్చు.

సినిమాలో చాలా భాగం వర్షం పడుతూవుంటుంది. ఆ మూడ్ ని సినెమాటోగ్రఫీ విభాగం(మనోజ్ పరమహంస) మనసుకి హత్తుకునేలా చిత్రీకరించింది. నేపధ్యసంగీతం చాలా బాగున్నా, పాటల్లో కొంత మోనాటనీ ధ్వనిస్తుంది. ఇది ఔట్-అన్డ్-ఔట్ దర్శకుడు ‘అరివళగన్‘ చిత్రం. భారతీయ సినిమాల్లో ధ్రిల్లర్లు వచ్చేదే చాలా అరుదు. అదీ ఇంత మంచిది రావడం అత్యంత అరుదు. కాబట్టి… అర్జంటుగా చూసెయ్యండి.

****

Tuesday, September 29, 2009

పరమసత్యాన్ని మించిన సత్యం !!!


ఈ టపా గురించి కొన్నివ్యాఖ్యల్లో ఎవరో అజ్ఞాత reference ఇస్తుంటే...ఇంకోసారి పోస్టు చేస్తున్నా... ఈ టపా ఆగష్టు,2008 లో మొదటిసారిగా ఈ బ్లాగులో పోస్టు చెయ్యబడింది.

సిద్దార్థుడు నిద్రపోతున్న భార్యాపిల్లల్ని వదిలి సత్యశోధనకై అడవుల్లో ప్రయాణించి ‘గయ’ చేరుకున్నాడు. బోధివృక్షం కింద జ్ఞానోదయం అయింది. ‘పరమసత్యం’ (Ultimate Truth) అవగతమయ్యింది. సత్యాన్ని కనుగొన్న ఉత్సాహం... ఎవరికైనా తెలియజెప్పాలన్న ఆతృత. సారనాధ్ తన మొదటి ప్రవచనానికి సిద్దమయ్యింది. ఐదుగురు శిష్యులు గౌరవంగా చేతుజోడించి ఎదురుగా నిల్చున్నారు.

"నిజంగా సత్యాన్ని అవగతం చేసుకుని బుద్ధుడి మారిన సిద్దార్థుడికా ఆ గౌరవం? లేక, ఇన్నికష్టాలు అనుభవించి రాజ్యాన్నీ, పెళ్ళాంపిల్లల్నీ అంత:పురంలో వదిలి అడవులపాలై తిరిగివచ్చిన ఒక సాధకుడిగా ఆ గౌరవం?" ఈ ప్రశ్నకి సమాధానం బుద్ధుడితో సహా ఎవరికీ తెలీదు.



సత్యాన్ని తెలుసుకోవడంద్వారా అనుభవించిన అలౌకిక ఆనందాన్ని, అవగతం చేసుకున్న పరమసత్యాన్ని ఎలా మాటల్లో చెప్పాలో బుద్దుడికైనా తెలిసేనా ! అనుభవానికి పదాలుకూర్చడం ముక్కుమూసుకుని ధ్యానిస్తే వచ్చేనా! మెల్లగా పెదాలు విడిపడ్డాయి...జీవితం దు:ఖమయం...కోరికలు దు:ఖానికి మూలకారణం...కోరికల్ని త్యజిస్తే దు:ఖాలు అంతమైపోతాయి. ఎదురుగా నించున్న శిష్యుల్లో ఎలాంటి చలనమూ లేదు. కనీసం కళ్ళలో ఈ పరమసత్యాన్ని తెలుసుకున్న ఆనందంకూడా ప్రతిఫలించడం లేదు. "ఇదేకదా నేను ఇన్నాళ్ళ ధ్యానంలో తెలుసుకున్నది. మరి సత్యం మరెవ్వరికీ అర్థం కాదా?" ఒక self doubt ఉదయించింది. పరమసత్యం అవగతమైనా, సందేహాలు తప్పవా! ఏమో!



పరమసత్యాన్ని తెలుసుకోవాలంటే అందరూ ధ్యానం చెయ్యాలా? దేన్ని ధ్యానించాలి? ఎంతకాలం ధ్యానించాలి? ఎలాధ్యానించాలి? ఎన్నో ప్రశ్నలు. తనే విడమర్చి చెబితే ! ప్రయత్నించాడు. చిన్నచిన్నఊర్లూ, పెద్దపెద్ద పట్టణాలూ అన్నీ తిరిగాడు. ప్రజలందరికీ ఈ సత్యాన్ని విప్పిచెప్పాడు. కొందరు అర్థమయ్యిందని తలలూపారు. శిష్యులు మరింత శ్రద్ధగా తలాడించారు. మరికొందరు, "ఐతే" అన్నట్లు ప్రశ్నార్థకంగా ముఖాలుపెట్టారు.

నిజమే, "ఐతే ఏమిటి?", "ఐతే ఎలా?" అప్పుడే తను పొందిన జ్ఞానంలోంచీ మరో వెలుగురేఖ ఉదయించింది. ‘అష్టాంగమార్గం’. ఎలా కోరికల్ని త్యజించాలో తెలియాలి. దానికి మార్గం అవగతం కావాలి. అయ్యింది. అదే మరోక మూలసూత్రం. మొదటి మూడింటితో కలిపి ఇప్పుడు నాలుగు.దు:ఖాలనుండీ విముక్తికి ఒక మార్గముంది, అదే అష్టాంగమార్గం. సత్యావగాహన (Right Understanding), సత్యాలోచన (Right Thought), సత్యవాక్కు (Right Speech), సత్యప్రవర్తన (Right Action),సత్యజీవని (Right Livelihood), సత్యయత్నం (Right Effort),సత్యయోచన (Right Mindfulness), సత్యఏకాగ్రత(Right Concentration).



మార్గం చెప్పగానే వానవెలిసిన స్పష్టత ఏర్పడినట్టుంది. తేటగా కనబడుతున్న ప్రజల ముఖాలు, "ఇదే సరైన దారి" అన్నట్లు శిష్యుల కళ్ళూ. సత్యశోధన బోధించడానికి దారి లభించింది. సులభంగా అర్థమయ్యేలా అవగతం చేసే మార్గం లభించింది. అప్పుడే ‘సంఘం’ ఏర్పడింది. ఈ దారిని నమ్మి ప్రయాణించే ప్రయాణికుల సమూహం. అదే సమయంలో ‘కపిలవస్తు’ నుండీ పిలుపువచ్చింది. బుద్దుడికళ్ళలో సందిగ్ధత. "తనది ఇంకా చిన్నతనమని తండ్రి అనుకుంటున్నాడేమో!" అని. ఏంత పెద్దవారైనా తల్లిదండ్రులకు ఎప్పటికీ చిన్నపిల్లమే కదా. భార్య యశోధర "ఎందుకిలా చేసావంటే, సమాధానం?". కొడుకు "నాన్నా...అంటే నువ్వేనా?" అని అడిగితే. ఇవే ఆలోచనలా, లేక వారికీ సత్యాన్ని చూపించాలనే తపనా ! అరమూసినకళ్ళలో అటు సందిగ్ధత ఇటు తపనా కనిపించకపోతే చెప్పేదెలా.



యశోధర వచ్చింది. ఎదురుగా నిలుచుంది. ఒకప్పుడు ప్రేమించిన దేహం. చుంబించిన నుదురు. ఒళ్ళంతాకప్పుకున్న జుట్టు. వెలిగే కళ్ళు. కానీ ఇప్పుడు. మారిపోయింది. చాలామారిపోయింది. "మార్పుకు కారణం నువ్వే" అన్నంతగా మారింది. నిలదీస్తుందో...నిందిస్తుందో తెలీదు.

తను పెదవి విప్పింది."ప్రపంచంలో ఒకే పరమసత్యం ఉన్నప్పుడు, అది అంత:పురంలో లేకుండా అడవిలో ఎలా దొరుకుతుందనుకున్నావు?". అంత సత్యం తెలిసిన బుద్దుడికి నోటమాట లేదు. సత్యం తెలిసిన బుద్దుడు నిజంకోసం వెతుకుతున్నాడు. తెలిసింది. "సత్యం ఎక్కడ దొరుకుతుందో నాకప్పుడు తెలీదు. ఒక్కటే తెలిసేది. అంత:పురంలో నన్ను సత్యన్ని చూడకుండా కట్టడి చేసారని. అందుకే అక్కడినుండీ పారిపోయాను. భార్యాబిడ్డల భాద్యత ఒక మనిషిగా నాకున్నాయని తెలుసు. అయినా సత్యశోధన బలం నన్ను ఈ బంధాలను త్యజించేలా చేసింది." యశోధర నవ్వినట్లనిపించింది. యశోధరకి పరమసత్యానికి మించిన సత్యమేదో తెలుసని బుద్దుడి మనసుకు అనిపించింది. "నిజంగా తెలుసా...!!! ఎలా అడగాలి?".



"బౌద్ద విహారానికొచ్చావు, ఏదైనా భిక్ష ఇవ్వకుండానే వెళ్ళిపోతావా?" అన్నాడు. కనీసం భిక్షగా అయినా పరమసత్యాన్ని మించిన సత్యాన్ని పరిచయం చేస్తుందేమో అన్న ఆశ.

"నా దగ్గర నా కొడుకుతప్ప ఇంకేమీ లేదు.తననే నీకు ధారాదత్తం చేస్తున్నాను. రాహుల్ తనదైన సత్యాన్ని కనుగొంటాడని కోరుకుంటాను.ఈ ప్రపంచంలో మరో యశోధర జన్మించకుండా ఆ సత్యం వుంటుందని ఆశిస్తాను." అది భార్యభర్తని ఎత్తిపొడిచినట్టుగా లేదు. ఒక జ్ఞాని తన శిష్యుడిని మందలించినట్టుగావుంది. బుద్దుడికి ఎలా అనిపించిందో తెలీదు.



రాహుల్ మంచి శిష్యుడిగా ఎదుగుతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి బుద్దుడు వెళ్ళినా ప్రజలు అగరొత్తులతో స్వాగతిస్తున్నారు. అతన్ని కీర్తిస్తూ గానం చేస్తున్నారు.దేవుడంటూ అభిమానిస్తున్నారు. తన ఆశీర్వాదంతొ మోక్షం పొందొచ్చనుకుంటున్నారు. ధనవంతులు విహారాలనూ, ఉద్యానవనాలనూ బుద్దుడికి గౌరవంగా నిర్మించి నిర్వాణం పొందొచ్చనుకుంటున్నారు. ఈ మార్పులు బుద్దుడికి అస్సలు అర్థం కావటం లేదు. తను చెప్పిన పరమసత్యంకన్నా, తానెప్పుడు ప్రాముఖ్యత సంతరించుకున్నాడో అవగతం కాని దశ. ఎవరినీ ప్రశ్నించలేని, గద్దించి జవాబు అడగలేని స్థితి. ఏంచెయ్యాలో తెలీని పరిస్థితి.



ఇలాంటి తరుణంలో రాహుల్ బుద్దుడి దగ్గరికొచ్చాడు. " నాకు పరమసత్యం అవగతమయ్యింది" అన్నాడు. తన ముఖవర్ఛస్సూ చుట్టూ ప్రతిఫలించే కాంతీ అది నిజమని చెప్పకనే చెబుతున్నాయి. బుద్దుడు మరోమాట మాట్లాడేలోపు రాహుల్ "నేను మళ్ళీ రాజ్యానికి వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది" అన్నాడు. బుద్దుడి కళ్ళలో ఆశ్చర్యం.

"పరమసత్యాన్ని గ్రహించినవాడివి వాటిని ప్రజలకు తెలియజెప్పాలని లేదా?" అని వీలైనంత శాంతంగా అడిగాడు. "తండ్రీ ! నన్ను మీకు అప్పగించేముందు నా తల్లి నాతో కొన్ని మాటలు చెప్పింది. నీ తండ్రి చెప్పిన దారిలో పయనిస్తూ ‘విశ్వజనీయమైన పరమ సత్యాన్ని’ (Universal Ultimate Truth) కాక నీదంటూ ఒక ప్రత్యేకమైన ‘వ్యక్తిగత సత్యాన్ని’ (Personal Truth) తెలుసుకో. ఎందుకంటే, ఒక సారి విశ్వజనీయమైన సత్యాన్ని గ్రహించిన పిదప ఆ సత్యాన్ని అందరూ గ్రహించాలని కాంక్షిస్తావు. కానీ అది అసాధ్యం. ప్రతిమనిషీ తనదైన సత్యాన్ని తెలుసుకుంటేతప్ప నిర్వాణాన్ని అందుకోలేడు. విశ్వజనీయమైన సత్యాన్ని వేరొకద్వారా వింటే మనిషికి అర్థం కాదు. సత్యంయొక్క మహత్తు తెలిసినతరువాత ఆ సత్యాన్ని త్వరగా పొందాలని ఆశించే స్వార్థం ప్రారంభమవుతుంది. ఆ స్థితిలో అష్టాంగమార్గం శూన్యమై దానికి విపరీతమైన లక్షణాలు అలవడుతాయి" అని చెప్పాడు రాహుల్.



మరోసారి బుద్ధుడికి జ్ఞానోదయం జరిగింది. "ఇదే పరమసత్యానికి మించిన సత్యం" అని అవగతమయ్యింది. "కానీ ఇప్పటివరకూ తాను చేసింది !" అనే సందేహంతోపాటూ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలోని రహస్యం బోధపడినట్లయ్యింది.

అప్పుడు ఈ సందేహాస్పద తధాగతుడిని చూసి రాహుల్ "శాక్యమునీ ! నీ ఆలోచన నాకు అర్థమయ్యింది. ప్రపంచం నీ పరమసత్యాన్ని అర్థం చేసుకోలేదు. ఈ ప్రపంచం ఎప్పటికీ అర్థం చేసుకోదుకూడాను. కానీ నీ బోధనలవలన కొన్ని విప్లవాత్మక పరిణామాలు జరిగాయని మర్చిపోకు. కొన్ని వేల సంవత్సరాలుగా అణగదొక్కబడిన పేదలు, దళితులూ ఈ వ్యవస్థని మొదటిసారిగా ప్రశ్నించారు. హిందూమతంలోని సామాజిక దురాచారాలనీ, మూఢాచారాలనీ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. త్యజిస్తున్నారు. పరమసత్యాన్ని వారు అందుకోలేకపోయినా సత్యం కానిదాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తిస్తున్నారు, నిరసిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇదే వ్యక్తిగత సత్యాన్ని సాధించటానికి గల ఉత్తమమైన మార్గం. నువ్వు చూపినదారి ఇంకోదారిని వెతుక్కుంది. ఈ దారి పరమసత్యాన్ని అందించకపోయినా, మెరుగైన జీవితాన్ని ఖచ్చితంగా అందిస్తుందు. అదే వ్యక్తిగత సత్యం. అదే ఇప్పుడు కావలసింది. నిజంగా కావలసింది దు:ఖం లేని జీవితంకాదు. పోరాడి సాధించుకునే హక్కులూ,స్వతంత్ర్యం." అన్నాడు.



తధాగతబుద్ధుడు మందస్మితుడైవున్నాడు. పరమసత్యాన్ని మించిన సత్యాన్ని గ్రహించిన యశోధరకు ప్రణమిల్లుతున్నాడు. రాహుల్ తన వ్యక్తిగత సత్యాన్ని తనలోనే వుంచుకున్నాడు.
లోకం మారింది కానీ బుద్దుడు అనుకున్నట్లుగా కాదు. పరమసత్యం ఇప్పటికీ ఎవరికీ తెలీదు.




*
మైధిలీ శరణ్ గుప్త్ రాసిన ‘యశోధర’ కవితకు నా సొంతపైత్యం జోడించి.



***