Saturday, January 26, 2013

తాడేపల్లి లలితాబాలసుబ్రమణ్యం పై పోలీస్ కేస్


ఫేస్ బుక్ లో స్త్రీలపై అసభ్యరాతలు రాసిన వ్యక్తులపై ఒక టీంగా కలిసి కమిషనర్ అనురాగ్ శర్మగారిని కలిసి కంప్లయింట్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ చాలా బాగా స్పందించారు. ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకునేలా సైబర్ సెల్ కు కంప్లయింట్ ను ఫార్వర్డ్ చేశారు. తాడేపల్లి లలితాబాలసుబ్రమణ్యం మరియు మోహన కృష్ణని ముఖ్య నిందుతులుగా మిగతా భజన మండలిని కో-అక్యూజ్డ్ గా పేర్కొన్న ఈ కంప్లయింట్ కేసురూపం దాల్చితే మూడు నుంచీ నాలుగు సంవత్సరాల కారాగారం ఖాయం. ఈ కేసు నుంచీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే మరిన్ని పరిణామాల్ని వీళ్ళు ఎదుర్కొనేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది.

కంప్లయింట్ అనంతరం వనిత టి.విలో లైవ్ గా జరిగిన చర్చ రేపు మధ్యాహ్నం 3.30 - 5.00 పున:ప్రసారం చేస్తారు. అందులో మరిన్ని వివరాలు మీకు అవగతమౌతాయి.