Tuesday, December 27, 2011
ఎడారివర్షం - లఘుచిత్రం
Posted by
Kathi Mahesh Kumar
at
5:50 PM
15
comments
Labels: వ్యక్తిగతం, సినిమాలు
Saturday, October 15, 2011
మాయావతి జిందాబాద్ !
బృహత్తర నిర్మాణాలే వారసత్వాలుగా గుర్తించే భారతదేశంలో, ప్రభుత్వం డబ్బుతో పార్కుల నిర్మాణం. దళితబాంధవుల విగ్రహాల నిర్మాణం చేసినందుకు మాయావతిని ఖండించాలట. ఎందుకు ఖండించాలో నాకు అర్థం కావడం లేదు. విగ్రహాల నిర్మాణం చెయ్యని పార్టీ ఏది? నాయకుల్ని చిరస్మరణీయులు చెయ్యడానికి ఎయిర్పోర్టులకి, రోడ్లకీ, పార్కులకీ, భవనాలకూ పేర్లుపెట్టని రాష్ట్రం ఏది? అవన్నీ పబ్లిక్ డబ్బులతో జరగలేదా?! ట్యాంక్ బండ్ మీద విగ్రహాలెందుకు? హుస్సేన్ సాగర్ లో బుద్దుడెందుకు? అది మాత్రం ట్యాక్స్ పేయర్ డబ్బుకాదా?!
మాయావతి చాలా మందికి నచ్చదు. తను బాహాటంగా చేసే వెల్త్ డిస్ప్లే అస్సలు నచ్చదు. నిజమే... బాత్రూముల్లో మాత్రమే బంగారు కమోడ్లు పెట్టుకునే నాగరికులుండే లోకంలో బాహాటంగా వెయ్యిరూపాయిల దండేసుకోవడం అసహ్యంగానే ఉంటుంది. చచ్చినోడి రాజకీయ ఉత్తరాధికారిగా నిరూపించుకోవడానికి వాడవాడలా విగ్రహాలు పెట్టిస్తే అది రాజకీయం. కానీ తన విగ్రహాన్ని తనే ఉద్ఘాటిస్తే మాత్రం అసహ్యం. ఇది ఏరూల్ బుక్ ప్రకారమో కాస్త చెబుతారా? ఆ రూల్ బుక్ తగులబెట్టడానికే పుట్టిన ‘మాయ’ ఇది. అగ్రకుల రాజకీయాల్ని, హిందూమతాహంకారాన్ని కాలరాయడానికి పుట్టిన ‘అతి’ ఇది.
****
Posted by
Kathi Mahesh Kumar
at
7:32 PM
63
comments
Labels: సమాజం
Tuesday, September 13, 2011
తెలుగు సినిమాలు - డబ్బింగ్ సినిమాలు
కన్నడ పరిశ్రమ తరహాలో ఇక్కడా డబ్బింగ్ సినిమాల్ని నిషేధిస్తారట: హహహ...
కర్ణాటకలో తెలుగు తమిళ సినిమాలు డైరెక్టుగానే రిలీజై వందరోజులు ఆడేస్తాయి. డబ్బింగ్ సినిమాలు వాళ్లకి అసలు అవసరమే లేదు. అయినా నిషేధాలవల్ల సినిమా పరిశ్రమ అభివృద్దిచెందదు. సెన్సిబుల్ సినిమాల వల్ల అభివృద్ధి చెందుతుంది. ఆ జ్ఞానం మనోళ్ళకి కావాలి. అయినా, డబ్బింగ్ సినిమాలు లేకపోతే ఉన్న థియేటర్లలో ఈగలు తోలుకోవలసిందే. డబ్బింగ్ సినిమాలు లేకపోతే పూటగడవని పరిస్థితికి తెలుగు పరిశ్రమ చేరింది. కాబట్టి డబ్బింగ్ మీద నిషేధం పరిశ్రమని మరింతగా దిగజారుస్తుందేతప్ప మెరుగుపరచదు. మౌళికాంశాలని వదిలేని ఈ పనికిమాలిన పనులేమిటో మన పరిశ్రమ పెద్దలకు!మన తెలుగు పరిశ్రమ సమస్యల విస్తృతత్వానికి అంతే విశాలమైన సమాధానాలు కావాలి. “సెన్సిబుల్ సినిమా” అనే పదం చిన్నదే అయినా దానిలో ఆ విశాలత్వం దాగుందని తమిళ,మళయాళ,బంగ్లా, మరాఠీ, హిందీ సినిమాలు నిరూపిస్తూ వస్తున్నాయి. సినిమాని కేవలం కళగా భావించినా చెల్లదు, వ్యాపారంగా మాత్రమే భావించినా పొసగదు. కళాత్మకవ్యాపారం అని అంగీకరిస్తూనే, రెంటిలోని నిబద్ధతని ఒకటిచెయ్యగలిగితేనే సెన్సిబుల్ సినిమా పుడుతుంది. విషయపరమైన సెన్సిటివిటీ దర్శకుడి బాధ్యత అయితే, వ్యాపారపరమైన సిన్సియారిటీకి నిర్మాత బాధ్యుడు. ఈ విధంగా ఇద్దరూ సెన్సిబుల్ సినిమాకి రథసారధులే.
వ్యాపారనిబద్ధత కలిగిన నిర్మాత ఆద్యుడైతే, కళపట్ల సమగ్రమైన అవగాహన కలిగిన దర్శకుడు మధ్యాంతాలుగా కొనసాగితేనే మంచి సినిమా పుడుతుంది. అటు వ్యాపారాత్మకంగానూ ఇటు కళాత్మకంగానూ వృద్ధిచెందుతుంది.
సమస్య నిర్మాతల వైపునుంచే అని ఒప్పుకోవాలనిపించినా, తమిళంలో మొదలైన దర్శకనిర్మాతల ట్రెండ్ నన్ను ఆపుతోంది. ఒక సెన్సిబుల్ సినిమా ఇచ్చి పరిశ్రమని ఒక కుదుపుకుదిపిన దర్శకులు తమిళంలో వెనువెంఠనే కార్పొరేట్ ఫండింగో, ఫైనాన్సర్ల ఫండింగో సంపాదించి దర్శకనిర్మాతలుగానూ, సెన్సిబుల్ నిర్మాతలుగానూ ఎదిగి వైవిధ్యాన్ని నిలబెడుతున్నారు. “ట్రెండ్” సృష్టిస్తున్నారు. కానీ తెలుగులో ఆ పరిణామం కనిపించదు. శేఖర్ కమ్ముల కొంత ప్రయత్నించినా, చంద్రశేఖర్ ఏలేటి, చంద్రసిద్దార్థ, క్రిష్, దేవకట్టా లాంటివాళ్ళుకూడా తమ సర్వైవల్ కోసం వెతుక్కునే పరిస్థితిదాటి ఎదగలేని బలహీనతలోనే ఉన్నారు. ఈపాటికి వీళ్ళ స్వీయదర్శకత్వంలోనో లేక నిర్మాణంలోనే కనీసం నాలుగేసి సినిమాలు సంవత్సరానికి వచ్చుంటే ఈపాటికి పరిశ్రమ రూపురేఖలు మారేవి.
కథల విషయానికి వస్తే, తెలుగు సినిమా కథలు చెప్పడం మానేసి సీన్ల అల్లికలోపడు పాతికసంవత్సరాలు దాటుతోంది. కాబట్టి మార్పు అక్కడినుంచే రావాలి. అది నిర్మాతగా కూడా మారగలిగే సత్తాఉన్న దర్శకుల దగ్గరనుంచే రావాలి. కథలు చాలానే ఉన్నాయి.
***
Posted by
Kathi Mahesh Kumar
at
6:49 AM
2
comments
Labels: సినిమాలు
Saturday, September 10, 2011
రెండు సినిమాలు: ఒకటి కొత్తది మరొకటి పాతది.
ఈటివి లో శోభన్ బాబు- లక్ష్మి నటించిన ‘కోడెనాగు’ సినిమా చూశా . చాలా శక్తివంతమైన సినిమా. యువతరం ఆరాటం. సమాజం పట్ల ఉండే నిరసన, కోపం. వ్యక్తిగత ద్వేషాలూ, పగ. అలవికాని ప్రేమ. అర్థంకాని ఆవేశాలు. ఎంత సహజంగా రచించారా అనిపించింది. ఈ భావతీవ్రత అంతా ఈ చిత్రానికి కన్నడ మాతృక అయిన ‘నాగరహావు’ రాసిన ‘తరాసు’ కు చెల్లుతాయనుకుంటా. పుట్టణ్ణ కణగల్ దర్శకత్వం వహించిన ఒరిజినల్ కూడా చూశాను. అందులో విష్ణువర్థన్ నటనే నాకు శోభన్ బాబుకన్నా బాగా నచ్చింది. బహుశా అదే విష్ణువర్థన్ మొదటి సినిమా కావడం, శోభన్ బాబు ఈ సినిమా చేసేసరికే ఒక ఇమేజ్ ఉండటం ఒక కారణం కావొచ్చు. కొడెనాగు సినిమాలో ఆచార్య ఆత్రేయ నటించడం ఒక హైలైట్.
ఈ ‘గ్యాంబ్లర్’ తో పెట్టుకుంటే పాపరే!
అజిత్ అభిమానుల వీరాభిమానం మీద, అతగాడి స్క్రీన్ ప్రెజెన్స్ మీద తప్ప స్క్రిప్టు మీద ఏమాత్రం శ్రద్ధలేకుండా తీసిన చిత్రం ఇది. ఒక థిల్లర్ కథకు అనవసరపు కామెడీ మిక్స్ చేసి అసందర్భమైన, అర్థరహితమైన స్క్రీన్ ప్లేతో సినిమా అంతా నడుస్తుంది. ఉపసంహారం (ఎపిలాగ్)లో మలుపు తిప్పి, కథ మొత్తాన్నీ మార్చేసే పద్దతి హాలీవుడ్ లో కొన్ని సినిమాలలో వర్కవుటైనా అప్పటికే సహనం చచ్చిన ప్రేక్షకుడికి ఈ చిత్రంలోని ఎండ్ ట్విస్ట్ ఏమాత్రం కిక్ ఇవ్వదు. అజిత్ నటన చాలా కొత్తగా, బాగుంది. అర్జున్ మామూలే. అంతకు మించి ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీలేదు.
****
Posted by
Kathi Mahesh Kumar
at
1:40 AM
1 comments
Labels: సినిమాలు
Tuesday, August 30, 2011
ది క్రిటిక్
అనగనగా ఇద్దరు స్నేహితులు.
చాలా సంవత్సరాల తరువాత పట్నంలో ఉంటున్న స్నేహితుడు పల్లెకొస్తే ఇద్దరూ కలిసారు.
చిన్ననాటి జ్ఞాపకాలు, పిండివంటల ఆహారాలు, పాతస్నేహితులతో సంబరాలూ అన్నీ అయ్యాయి.
అన్నీ అయ్యాక పల్లెలో ఉన్న స్నేహితుడికి తనదగ్గరున్న ఒక విచిత్రాన్ని పట్నం మిత్రుడికి చూపించాలనుకున్నాడు.
“చెరువులో బాతుల్ని వేటాడటానికి వెళ్దాం” అని పూర్వజుల మరతుపాకి ఒకచేత్తో మరోచేత్తో విశ్వాసపాత్రమైన కుక్కనూ తీసుకుని బయల్దేరమన్నాడు పల్లెమిత్రుడు.
ఇద్దరూ చెరువుగట్టుకొచ్చారు.
పల్లెమిత్రుడిలో ఒక ఎక్సైట్మెంట్, ఏదో చూపించాలనే తపన.
గురిపెట్టి ఒక బాతుని కాల్చి గర్వంగా పట్నం మిత్రుడి వైపు చూశాడు. పట్నం మిత్రుడి ముఖంలో ఎటువంటి రియాక్షనూ లేదు.
పల్లె మిత్రుడు చిన్నగా నవ్వుకున్నాడు. పక్కకు తిరిగి తన కుక్క వైపు చూసి ఒక సైగచేశాడు.
అంతే...కుక్క అమాంతం నీళ్ళలోకి దూకింది. విచిత్రం...కుక్క నీళ్ళలో ఒక అంగుళంకూడా మునగలేదు. దర్జాగా నడుచుకుంటూ వెళ్ళి బాతుని నోటితో కరుచుకుని ఒడ్డుకుతీసుకొచ్చి యజమాని చేతిలో పెట్టింది.
పల్లెమిత్రుడు, పట్నం మిత్రుడి ముఖంలో విచిత్రాన్ని చూసిన అనుభూతిని చూద్దామని తిరిగి చూశాడు.
పల్లెమిత్రుడు, పట్నం మిత్రుడి ముఖంలో విచిత్రాన్ని చూసిన అనుభూతిని చూద్దామని తిరిగి చూశాడు.
ఆ స్నేహితుడి ముఖంలో ఎటువంటి స్పందనా లేదు. ఏ అధ్బుతాన్నీ చూసిన ఆనవాళ్ళు లేవు.
పల్లె మిత్రుడికి విచిత్రమనిపించింది. మళ్ళీ బాతుని కాల్చాడు. మళ్ళీ కుక్క నీళ్ళపై నడుచుకుంటూ బాతుని తీసుకుని యజమానికిచ్చింది. ఇలా ఇంకో నాలుగుసార్లు చేశాడు.
కనీసం స్నేహితుడు “ఎలా” అనైనా అడుగుతాడేమో అని ఆశగా చూశాడు.
స్పందన లేదు.
నిరాశగా, “ఇంటికి వెళ్దామా” అంటూ లేచాడు.
స్నేహితుడు అప్పటికే లేచి బయల్దేరాడు. పల్లె మిత్రుడు వడివడిగా బాతుల్ని బ్యాగ్ లో పెట్టుకుని స్నేహితుడి దగ్గరికి వచ్చి, ఇక తప్పదన్నట్టుగా “నీకేమీ తేడాగా అనిపించలేదా” అని క్యూరియస్గా అడిగాడు.
స్నేహితుడు ఒక్కసారి వెనక్కి తిరిగి బాతుల బుట్టవైపు, మరతుపాకివైపు, కుక్కవైపూ చూసి,
“అనిపించిది. తెలిసొచ్చింది. నీ కుక్కకు ఈదడం రాదని” అంటూ వెళ్ళిపోయాడు.
అవాక్కయిన పల్లె స్నేహితుడు మరునిముషంలో తేరుకుని...”ఓరేయ్ ఇంతకీ నువ్వు పట్నంలో ఏంచేస్తుంటావూ” అన్నాడు.
“నేనా ! ఒక విమర్శకుడిని” అంటు చక్కాపోయాడు ఆ మిత్రుడు.
(మిత్రుడు ఆర్. కె. చెప్పిన పిట్టకథ ఆధారంగా)
Posted by
Kathi Mahesh Kumar
at
7:29 AM
2
comments
Labels: కథ
Thursday, August 25, 2011
వచ్చాడు. కెలికాడు.
నిన్న సినీమ్యాక్స్ లో సినిమా చూడ్డానికి వెళుతుండగా ఒక మీడియా మిత్రుడు ఎదురుపడ్డాడు. ఒక ప్రముఖ దినపత్రికలో సినిమా జర్నలిస్టు. “ఏంటిబాసూ ఇక్కడ” అంటే “వర్మ సినిమాకిలే” అని జవాబిచ్చాను. పెద్ద టాక్ లేదుకదా మళ్ళీ ఎందుకు వెళ్ళడం అంటూ నా వైపు ఒకసారి చూసి నవ్వేసాడు. నేనూ ఇబ్బందిగా ఎంతైనా వర్మ సినిమాకదా అని కవరింగ్ ఇచ్చాను.
అప్పుడే చుట్టుపక్కల గమనించాను. ఏదో సినిమా స్టాండీలు, వాటిపైన తమిళనటుడు జీవా ఫోటోలు “ఏంటీ రంగం సినిమా విజయోత్సవాలా?!” అనిఅడిగితే దానికి మిత్రుడు నవ్వేసి, “కాదు. రాబోయే సినిమా ప్రమోషన్లు” ఓహో...అంటూ పరికించి చూస్తే ఆ సినిమా టైటిల్ “వచ్చాడు. గెలిచాడు”...
సర్కాస్టిగ్గా నా మిత్రుడివైపు తిరిగి “‘రంగం’తో వచ్చాడు హిట్ కొట్టి గెలిచాడా!” అన్నాను.
తను నావైపు తమాషాగా చూస్తూ “ఇండస్ట్రీ అంతేకదా బ్రదర్. హిట్ ఉన్నవాడిదే రాజ్యం. వాడు ఏంచేసినా చెల్లుతుంది. ఏం చెప్పినా ఊకొడుతుంది” అని పత్రిక ప్రాస భాషలో అనేశాడు.
“రంగం సినిమా హిట్ అవడానికి కారణం కథ కదా, మరి అలాంటి కథల్ని వెతుక్కోకుండా ఆ హీరోని పట్టుకుని వేలాడితే మరో హిట్ వస్తుందని ఎందుకనుకుంటారు మనోళ్ళు” అని నేను సాలోచనగా నాలోనేను అనుకుంటే, నా మిత్రుడు సానుభూతిగా నా భుజంతట్టి, “ఇలా అలోచించి బుర్ర పాడుచేసుకోకు. నాకైతే ఈ సినిమా హిట్ అవడానికి జీవాకన్నా ఇంకో నటుడు అజ్మల్ పాత్ర కారణం అనిపిస్తుంది” అని చల్లగా చెప్పాడు.
నిజమే జీవాకు రంగం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నమాట నిజమేకానీ, కథాపరంగా అజ్మల్ చేసిన యువరాజకీయనేత పాత్ర నటనపరంగానూ, సబ్జెక్టుపరంగానూ చాలా ప్రముఖమైన పాత్ర. చివరికొచ్చేసరికీ మొత్తంగా కథను నడిపిన పాత్రగా నిలబడుతుంది.
కాకపోతే సమస్యల్ని తీర్చేవాడే హీరోకాబట్టి చివరాఖరికి జీవానే ఆ సినిమా హీరో. నా ఆలోచన సంగతి ఎలా ఉన్నా అసలే కాన్స్పిరసీ థియరీలు రాసే పత్రికలో గాసిప్స్ రాసే పాత్రికేయుడిగా నా మిత్రుడి ఆలోచన ఎలా ఉందో తెలుసుకుందామనే క్యూరియాసిటీ కలిగి “అలా ఎందుకనుకుంటున్నావ్?” అని ఒక శరంసంధించాను. కానీ నేను రియలైజ్ కానిది ఎంట్రా అంటే, ఈ మిత్రుడు నా మైండ్ బ్లాంకయ్యే కాన్స్పిరసీ చెబుతాడని.
నా మిత్రుడు చెప్పెనదాని ప్రకారం రంగం సినిమా తెలుగులో హిట్ అవ్వడానికి ముఖ్యకారణం అజ్మల్ పాత్ర్ర. “ఒకసారి జాగ్రత్తగా గమనించు, ఆ పాత్ర తీరు, డ్రస్సింగ్, డయలాగ్స్ అన్నీ మన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్ ని తలిపించడంలేదూ!” అన్నాడు.
ఒక్క క్షణం నాకు పోలిక అర్థం కాలేదు. కానీ ఎందుకో మళ్ళీ ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళి సినిమా రీలు మైండ్ లో తిరగేస్తే ఒక క్రూషియల్ సీన్ లో “నేనూ స్వార్థపరుడినే, నా కుటుంబం బాగుండాలని కోరుకుంటాను. కాకపోతే నా కుటుంబం పెద్దది. విశాలమైనది. మీరు, ఈ సమాజం, దేశం అన్నీ దానిలో భాగమే” అంటూ ఏదో ఒక డైలాగ్ ఉంటుంది. అది ఎగ్జాక్ట్ గా ఏదో సభలో (లోక్ సత్తా పార్టీ ఆవిర్భావసభ అనుకుంటా) అన్నాడు. “హమ్మో! నిజమేనేమో” అనుకున్నా.
“అయితే మాత్రం” అంటూ ఏదో బింకం నటించడానికి ప్రయత్నించాను. నా మిత్రుడు సాలోచనగా నన్ను పక్కకు తీసుకెళ్ళి “బాసూ, రంగం సినిమా A సెంటర్లకన్నా B-C సెంటర్లలో బాగా ఆడింది. సినిమా బాగుండటంతో పాటూ ఆంధప్రదేశ్ రాజకీయాలకు చాలా దగ్గరగా ఉంటుంది. జయప్రకాష్ నారాయణ్ లాంటి న్యూట్రల్ సిన్సియర్ ఫేస్ ను అడ్డుపెట్టుకును ఈనాడు పేపర్ అటు కాంగ్రెస్ ను తెలుగుదేశం ను ఎలా ఆడుకుందో వాడుకుందో అనేదే అసలు కథ. ప్రజలకు అర్థమయిన కథ. జె.పి.ఎలాగూ అగ్రకులాల రాజకీయాలకు మరో ఫేసు తనబండారమూ ఇలా ఎదో ఒక రోజు బయటపడుతుందని అందరికీ తెలుసు. ప్రజలకు అన్నీ తెలుసు. అందుకే అలా కనెక్ట్ అయిపోయారు” అని తన కాన్స్పిరసీ థియరీతో నాకు జ్ఞానోదయం కలిగించాడు.
“ఛా! నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావ్. సినిమా బాగుంది హిట్ అయ్యింది” అని నేను కొంచెం బెదురుగా అంటే, “బ్రదరూ జె,పి. కుల కోఠరీ గురించి, ఈనాడు అతన్ని ఎలా లీడర్ ను చేసింది అనేదాని గురించీ నీకూ తెలుసుకదా?” అని అడిగాడు.
“అదిసరే! కానీ మరీ సినిమా కథకూ దానికీ లింకు కట్టడం నాకైతే పెద్దగా లాజికల్ గా అనిపించడం లేదు” అని తేల్చేశాను. నా మిత్రుడు కొంచెం కోపంగా “ఇదేనయ్యా మీలాంటి సీరియస్ ఫిల్మ్ క్రిటిక్స్ తో వచ్చే తంటా, ‘తెలుగుతనం లేదు కాబట్టే శక్తి, తీన్ మార్, బద్రీనాథ్ ఫెయిలయ్యాయి’ అంటారు. ఇదిగో ఈ తెలుగు రాజకీయాల్ని చూపించింది కాబట్టే రంగం సినిమా హిట్ అయ్యింది అంటే మాత్రం ఒప్పుకోవడానికి కష్టం అంటారు. ఎలాగయ్యా మీతో చేసేది” అనేశాడు.
“మరీ బోడి గుండుకీ మోకాలికీ ముడిపెట్టడం...” అంటూనేను నసుగుతుండగానే ఎవరో ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అవుతోందనే సరికీ ఫ్రీబీస్, స్వీట్ ప్యాకెట్స్, గిఫ్ట్ కవర్ల కోసం మావోడులగెత్తాడు కవరేజ్ అనుకుంటూ. నేను మాత్రం చేతిలో రాంగోపాల్ వర్మ ‘నాట్ ఎలవ్ స్టోరీ’ సినిమా టికెట్లు పట్టుకుని పిచ్చిచూపులు చూస్తూ “వచ్చాడు గెలిచాడు” పోస్టర్ చూస్తుంటే పోస్టర్ మసకబారి “వచ్చాడు. కెలికాడు” లా కనిపించింది.
అప్పుడే చుట్టుపక్కల గమనించాను. ఏదో సినిమా స్టాండీలు, వాటిపైన తమిళనటుడు జీవా ఫోటోలు “ఏంటీ రంగం సినిమా విజయోత్సవాలా?!” అనిఅడిగితే దానికి మిత్రుడు నవ్వేసి, “కాదు. రాబోయే సినిమా ప్రమోషన్లు” ఓహో...అంటూ పరికించి చూస్తే ఆ సినిమా టైటిల్ “వచ్చాడు. గెలిచాడు”...
సర్కాస్టిగ్గా నా మిత్రుడివైపు తిరిగి “‘రంగం’తో వచ్చాడు హిట్ కొట్టి గెలిచాడా!” అన్నాను.
తను నావైపు తమాషాగా చూస్తూ “ఇండస్ట్రీ అంతేకదా బ్రదర్. హిట్ ఉన్నవాడిదే రాజ్యం. వాడు ఏంచేసినా చెల్లుతుంది. ఏం చెప్పినా ఊకొడుతుంది” అని పత్రిక ప్రాస భాషలో అనేశాడు.
“రంగం సినిమా హిట్ అవడానికి కారణం కథ కదా, మరి అలాంటి కథల్ని వెతుక్కోకుండా ఆ హీరోని పట్టుకుని వేలాడితే మరో హిట్ వస్తుందని ఎందుకనుకుంటారు మనోళ్ళు” అని నేను సాలోచనగా నాలోనేను అనుకుంటే, నా మిత్రుడు సానుభూతిగా నా భుజంతట్టి, “ఇలా అలోచించి బుర్ర పాడుచేసుకోకు. నాకైతే ఈ సినిమా హిట్ అవడానికి జీవాకన్నా ఇంకో నటుడు అజ్మల్ పాత్ర కారణం అనిపిస్తుంది” అని చల్లగా చెప్పాడు.
నిజమే జీవాకు రంగం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నమాట నిజమేకానీ, కథాపరంగా అజ్మల్ చేసిన యువరాజకీయనేత పాత్ర నటనపరంగానూ, సబ్జెక్టుపరంగానూ చాలా ప్రముఖమైన పాత్ర. చివరికొచ్చేసరికీ మొత్తంగా కథను నడిపిన పాత్రగా నిలబడుతుంది.
కాకపోతే సమస్యల్ని తీర్చేవాడే హీరోకాబట్టి చివరాఖరికి జీవానే ఆ సినిమా హీరో. నా ఆలోచన సంగతి ఎలా ఉన్నా అసలే కాన్స్పిరసీ థియరీలు రాసే పత్రికలో గాసిప్స్ రాసే పాత్రికేయుడిగా నా మిత్రుడి ఆలోచన ఎలా ఉందో తెలుసుకుందామనే క్యూరియాసిటీ కలిగి “అలా ఎందుకనుకుంటున్నావ్?” అని ఒక శరంసంధించాను. కానీ నేను రియలైజ్ కానిది ఎంట్రా అంటే, ఈ మిత్రుడు నా మైండ్ బ్లాంకయ్యే కాన్స్పిరసీ చెబుతాడని.
నా మిత్రుడు చెప్పెనదాని ప్రకారం రంగం సినిమా తెలుగులో హిట్ అవ్వడానికి ముఖ్యకారణం అజ్మల్ పాత్ర్ర. “ఒకసారి జాగ్రత్తగా గమనించు, ఆ పాత్ర తీరు, డ్రస్సింగ్, డయలాగ్స్ అన్నీ మన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్ ని తలిపించడంలేదూ!” అన్నాడు.
ఒక్క క్షణం నాకు పోలిక అర్థం కాలేదు. కానీ ఎందుకో మళ్ళీ ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళి సినిమా రీలు మైండ్ లో తిరగేస్తే ఒక క్రూషియల్ సీన్ లో “నేనూ స్వార్థపరుడినే, నా కుటుంబం బాగుండాలని కోరుకుంటాను. కాకపోతే నా కుటుంబం పెద్దది. విశాలమైనది. మీరు, ఈ సమాజం, దేశం అన్నీ దానిలో భాగమే” అంటూ ఏదో ఒక డైలాగ్ ఉంటుంది. అది ఎగ్జాక్ట్ గా ఏదో సభలో (లోక్ సత్తా పార్టీ ఆవిర్భావసభ అనుకుంటా) అన్నాడు. “హమ్మో! నిజమేనేమో” అనుకున్నా.
“అయితే మాత్రం” అంటూ ఏదో బింకం నటించడానికి ప్రయత్నించాను. నా మిత్రుడు సాలోచనగా నన్ను పక్కకు తీసుకెళ్ళి “బాసూ, రంగం సినిమా A సెంటర్లకన్నా B-C సెంటర్లలో బాగా ఆడింది. సినిమా బాగుండటంతో పాటూ ఆంధప్రదేశ్ రాజకీయాలకు చాలా దగ్గరగా ఉంటుంది. జయప్రకాష్ నారాయణ్ లాంటి న్యూట్రల్ సిన్సియర్ ఫేస్ ను అడ్డుపెట్టుకును ఈనాడు పేపర్ అటు కాంగ్రెస్ ను తెలుగుదేశం ను ఎలా ఆడుకుందో వాడుకుందో అనేదే అసలు కథ. ప్రజలకు అర్థమయిన కథ. జె.పి.ఎలాగూ అగ్రకులాల రాజకీయాలకు మరో ఫేసు తనబండారమూ ఇలా ఎదో ఒక రోజు బయటపడుతుందని అందరికీ తెలుసు. ప్రజలకు అన్నీ తెలుసు. అందుకే అలా కనెక్ట్ అయిపోయారు” అని తన కాన్స్పిరసీ థియరీతో నాకు జ్ఞానోదయం కలిగించాడు.
“ఛా! నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావ్. సినిమా బాగుంది హిట్ అయ్యింది” అని నేను కొంచెం బెదురుగా అంటే, “బ్రదరూ జె,పి. కుల కోఠరీ గురించి, ఈనాడు అతన్ని ఎలా లీడర్ ను చేసింది అనేదాని గురించీ నీకూ తెలుసుకదా?” అని అడిగాడు.
“అదిసరే! కానీ మరీ సినిమా కథకూ దానికీ లింకు కట్టడం నాకైతే పెద్దగా లాజికల్ గా అనిపించడం లేదు” అని తేల్చేశాను. నా మిత్రుడు కొంచెం కోపంగా “ఇదేనయ్యా మీలాంటి సీరియస్ ఫిల్మ్ క్రిటిక్స్ తో వచ్చే తంటా, ‘తెలుగుతనం లేదు కాబట్టే శక్తి, తీన్ మార్, బద్రీనాథ్ ఫెయిలయ్యాయి’ అంటారు. ఇదిగో ఈ తెలుగు రాజకీయాల్ని చూపించింది కాబట్టే రంగం సినిమా హిట్ అయ్యింది అంటే మాత్రం ఒప్పుకోవడానికి కష్టం అంటారు. ఎలాగయ్యా మీతో చేసేది” అనేశాడు.
“మరీ బోడి గుండుకీ మోకాలికీ ముడిపెట్టడం...” అంటూనేను నసుగుతుండగానే ఎవరో ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అవుతోందనే సరికీ ఫ్రీబీస్, స్వీట్ ప్యాకెట్స్, గిఫ్ట్ కవర్ల కోసం మావోడులగెత్తాడు కవరేజ్ అనుకుంటూ. నేను మాత్రం చేతిలో రాంగోపాల్ వర్మ ‘నాట్ ఎలవ్ స్టోరీ’ సినిమా టికెట్లు పట్టుకుని పిచ్చిచూపులు చూస్తూ “వచ్చాడు గెలిచాడు” పోస్టర్ చూస్తుంటే పోస్టర్ మసకబారి “వచ్చాడు. కెలికాడు” లా కనిపించింది.
****
Posted by
Kathi Mahesh Kumar
at
11:59 AM
6
comments
Labels: సినిమాలు
Friday, August 5, 2011
ఈ మధ్యకాలంలో బ్లాగులు రాయాలనిపించలేదు.
ఈ మధ్యకాలంలో బ్లాగులు రాయాలనిపించలేదు.
రాయడం మర్చిపోకూడదని, ఆలోచనలకు అక్షరాల్ని ప్రోదిచేసుకునే అనుభవాన్ని సంపాదించాలని, రాయడంలోని ఆనందం అనుభవించాలని ఇలా ఏవేవో ఉద్దేశాలతో బ్లాగడం ప్రారంభించానో అవన్నీ తీరాయన్న నమ్మకంకన్నా, పబ్లిక్ ఫోరంలో అభిప్రాయాల్ని పంచుకుంటే వ్యతిరేకతతోపాటూ విరోధం పెంచుకునే మానసిక స్థితిలోనే మన తెలుగు ఫ్యూడల్ మనస్తత్వాలు ఇప్పటికీ ఉన్నాయనే జ్ఞానం, బ్లాగులు రాయకపోవడానికి ఎక్కువ కారణమేమో అనిపిస్తోంది. It is sad but, true. భయంకాదు, చిరాకు ఈ గోలంటే.
ఇంకోకారణం, ఈ గోలంతా లేని alternate medium దొరకడం. I am happy on FACEBOOK.
Posted by
Kathi Mahesh Kumar
at
7:45 PM
13
comments
Labels: వ్యక్తిగతం
Subscribe to:
Posts (Atom)