
ప్రియమైన బ్లాగరులారా, సాధారణంగా చావా కిరణ్ గారు బ్లాగుల్లో రాయవలసిన ‘ఈ పక్షం విషయం’ సూచించేవారు. కానీ ఈ సారి నాకు ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది.
"Memory is a way of holding on to the things you love, the things you are, the things you never
want to lose" అంటారు. అంటే, మననుండీ ఎప్పటికీ విడిపోని, కోల్పోని, ప్రియమైన గుర్తులే జ్ఞాపకాలు అని. ఎంత అందమైన ఆలోచన!
జ్ఞాపకాలే లేకపోతే మన జీవితం ఇంత అద్భుతంగా అనిపించేదా? అందుకే అనుకుంటా బహుశా, "A memory is what is left when something happens and does not completely unhappen" అంటారు. ప్రతి మనిషి జీవితంలో ఈ జ్ఞాపకాలుంటాయి. కొన్ని తీపి, కొన్ని చేదు, కొన్ని వగరు, కొన్ని అద్భుతం, కొన్ని అతిశయం మరికొన్ని ఆనందాన్ని తమలో ఇముడ్చుకుని మన హృదయాంతరాలల్లో నిక్షిప్తంగా ఉండిపోతాయి.
వాటిని తట్టిలేపుదాం... ఆకారాన్నిద్దాం.... అక్షరాల్లో ఇముడ్చుదాం...అందరితో పంచుకుందాం.
"Every man's memory is his private literature" మన బ్లాగులు మన భావవ్యక్తీకరణ ప్రపంచాలే కనుక, మన జీవన సాహిత్యాన్ని మనదైన శైలిలో పంచుకుందాం.
అందుకే, ఈ పక్షం (15 రోజుల) విషయం "మర్చిపోలేని జ్ఞాపకాలు". ఈ రోజు 8 జూలై నుండీ 23 జూలై వరకూ మనమన బ్లాగుల్లో ఈ విషయంపై టపాలు రాద్దాం. ఎక్కువ స్పందనను పొందిన టపాను ఉత్తమ టపాగా ఎంచి గౌరవిద్దాం.
Tuesday, July 8, 2008
జ్ఞాపకాల్ని అక్షరబద్ధం చేద్దాం రండి !
Posted by
Kathi Mahesh Kumar
at
1:49 PM
17
comments
Labels: బ్లాగులు
Monday, July 7, 2008
మగాళ్ళు ‘ఈవ్ టీజింగ్’ ఎందుకు చేస్తారు ? Part 2
‘ఈవ్ టీజింగ్’ పైన ఇంతకు మునుపు నేను రాసిన టపా పైన జరిగిన చర్చ దాదాపు మొరాలిటీ (morality) పై ఉండటం కాస్త ఆశ్చర్యంతో పాటూ బాధని కలిగించింది. దానితో పాటూ సెక్స్ గురించి ఉన్న సామాజిక విలువల పట్ల మన భారతీయుల్లో ఉండే over obsession విస్మయానికి గురిచేసింది. కొన్ని ఆలోచనల తీవ్రత ఎలా ఉందంటే, ‘మనుషుల్ని చంపైనా సరే దేవాలయాన్ని నిర్మిస్తాం’ అనే తీరులో, ‘ఈవ్ టీజింగ్ ఉన్నా ఫరవాలేదుకానీ మన సమాజ విలువల్ని మాత్రం ప్రశ్నించకూడదు’ అన్నట్లుగా అనిపించాయి.
మూలకారణం ఇదీ అని కొన్ని పరిశోధనలు చెబుతున్నా, ఆ పరిశోధనల్ని ప్రశ్నిస్తున్నామేగానీ, సమస్య తీవ్రతను అర్థం చేసుకుని కనీసం తమకు తోచిన పరిష్కారాన్ని చెప్పలేకపోతున్నాం. కొందరు కొన్ని పరిష్కారాలు చెప్పడంకూడా జరిగింది. ఆ చర్చల్ని క్రోడీకరించి ఇక్కడ అసలు సమస్య తీవ్రతని విపులంగా చర్చించడానికి ప్రయత్నిస్తాను. పరిష్కారాలు ఈ టపాకు వచ్చిన స్పందనల్ని దృష్టిలో ఉంచుకుని తరువాత భాగంలో వివరిస్తాను.
‘ఈవ్ టీజింగ్’ అనే పదం ఈ సమస్య తీవ్రతను మరుగుపరుస్తోందని నా అనుమానం. అసలు ఈ పదానికి అర్థమేమిటి? థెసారస్ డిక్షనరీ ప్రకారం, ఈ పదం native English పదం కాదట, దీని పుట్టుక మన భారతదేశంలోనే జరిగింది. దీని అర్థం "harassment of women". ఈ అర్థం యొక్క అమానుషత్వం ఆ పదంలో కనబడుతోందా, అన్నది ప్రశ్నార్థకమే! అంటే, ఈ పదం ప్రయోగమే సమస్యను సాంకెతికంగా మరుగుపరిచడానికి (euphemism) చేసిన ప్రయత్నమన్న మాట.
ఇక సమస్య తీవ్రత గురించి చెప్పాలంటే, చాలా మంది మహిళలు...కాదు కాదు...అందరు భారతీయ మహిళలూ ఈ సమస్యను ఏదోఒక స్థాయిలో అనుభవించినవారే.మరి ఇంత విస్తృతమైన ఉన్న ప్రాబ్లమ్ గురించి కనీసం పెద్దస్థాయి చర్చకూడా ఎందుకు జరగదంటే, ‘ఇలాంటివి జరుగుతూ ఉంటాయ్, వీటి గురించి మర్చిపోవాలి’ అనే నిరాసక్తత. మానభంగం జరిగినా ‘she might have asked for it' అనే మగదృక్కోణం (ఇది ఆడవాళ్ళలో కూడా ఉంటుంది). ‘ఇది మామూలే’ అనే అలవాటుపడినతనం. ‘ఇలాంటివి బయటకి చెప్పుకుంటే, సిగ్గుచేటు’ అనే సామాజిక కండిషనింగ్. వెరసి ఇదొక వికృత సామాజిక రుగ్మత అన్న నిజం మరుగునపడిపోయి, స్వేచ్చగా ఆడవాళ్ళని ఈ సమస్యను అనుభవించడానికి వదిలేసాం. చాలా గొప్ప "యత్ర నార్యస్తు పూజ్యంతే" సంస్కృతి కదా మనది! ఆ మాటే నిజమయ్యుంటే, ఈ దేశంలో దేవతలు కాదు దెయ్యాలు వాసం చేస్తుండాలి.
ఈ సమస్య యొక్క రూపాల్ని కొంత చూద్దాం.
చూపులు: దీనికి ముద్దుగా దీన్ని ‘సైట్ కొట్టడం’ అని పేరు. యుక్తవయసులో అమ్మాయి అబ్బాయిల్నీ, అబ్బాయిలు అమాయిల్నీ చూసుకోవడం సహజం. కానీ ఇది ‘సమస్యగా’ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తయారవుతుంది. కాలేజిలో నా స్నేహితురాలు ఈ విషయంగా బాధపడుతుంటే, "అబ్బాయిలు చూడకపోతే, చూడలేదంటారు. చూస్తే ఇలా బాధపడతారు" అని నేన్నదనికి తను , "looking is OK with us, but preying at us is not very acceptable" అంది. తన భావం తెలుగులో చెప్పాలంటే, "చూడ్డం వరకూ మాకు సమస్యలేదు, కాని తినేసాలా చూస్తేనే కాస్త ఇబ్బందిగా ఉంటుంది" అని. ఈ విషయాన్ని కాస్త పొడిగిస్తే, ‘కొందరి మగాళ్ళచూపులు, కళ్ళతోనే బట్టలు ఊడదీసినట్టుగా అనిపించి అసహ్యం వేస్తుంది’ అని. ఇప్పుడీ చూపులకి మొబైల్ కెమెరాలూ, రివ్యూ మిర్రర్ లూ తోడయ్యాయి.అంటే సమస్యని ఎంత లోతుగా అర్థంచెసుకుంటే అంత అసహ్యం వేస్తుందని నాకు తెలిసింది. అసలు సమస్యే లేదు, ఇదొక accepted culture అనుకుంటే, అసలు సమస్యే లేదు అని కూడా అర్థమయ్యింది. కానీ I prefer to understand the issue rather than keeping it under the carpet.
కూతలు : ఇంగ్లీషులో cat calling అనే ఒక పదం ఉంది. ఈ విధానానికి తగిన పదం అదే అనుకుంటా. అమ్మాయిలను చూడగానే అరుపులూ, కేకలూ,ఈలలూ వెయ్యాలనిపిస్తుంది కొందరికి. ఈ కామెంట్లు అమ్మాయి డ్రస్సుతో మొదలై అంగాల వర్ణన వరకూ వెళ్తాయి. ఇక్కడ హద్దులు కొన్నిసార్లు ఎంతగా మితిమీరిపోతాయంటే, ఈ ప్రబుద్ధులు చిన్నపిల్లల్ని కూడా వదలరు. "పిల్లే ఇంత బాగుంటే, తల్లెలా ఉంటుందో" అనికూడా తమ సృజనాత్మకతనూ, extended imagination ను ప్రదర్శిస్తారు.ఈ వికృతం సాధారణంగా గుంపులుగా ఉండే మగవాళ్ళు చేస్తారు. ఒంటరిగా ఉంటే నోరు కూడా పెగలని మగాడు, మంది తోడుంటే మృగమైపోతాడన్నమాట. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే, ఈ సంస్కృతి ‘మెజారిటీ’కి అంగీకారమైనది అని. మన ప్రజాస్వామ్యం ప్రకారం దీనికి లైసెంస్ ఇవ్వాల్సిందే. కొందరిని ఇలా ఎందుకు చేస్తారని అడిగితే "just for fun" అన్నారట. ఎదుటివాళ్ళు ఎంత బాధపడతారో కూడా తెలీకుండా అనుభవించే ఆనందాన్ని fun అనాలా, లేక పైచాచికత్వం అనాలా? ఆడాళ్ళుపడే బాధకి కొలమానాలు లేవుగనక, let them have fun అనుకుని సరిపెట్టుకుందామా?
చేతులు - చేతలు: బస్టాపుల్లో,బస్సుల్లో, వర్క్ ప్లేస్ లో, బజార్లో , షాపింగ్ మాల్లో, లోకల్ ట్రైన్ లో, సినిమా హాల్లో ప్రతిచొటా ‘యాక్సిడెంటల్’ గా తగిలే చేతులు, ఆ చేతులు అప్పుడప్పుడూ మితిమీరి చేసే చేతలు. ఇది, ఈ సంస్కృతిలో మరోస్థాయి. ఎందుకు చేస్తారూ అంటే, "I get a guilty pleasure out of it" అన్నాడత ఒక పట్టుబడిన ఈవ్ టీజర్. తప్పని తెలుసు, కానీ అలా చెయ్యడంలో ఆనందం అనుభవిస్తాడట. అది ఒక మానసిక రుగ్మతలాగా వినిపించడం లేదూ? అంటే, మన చుట్టుపక్కల చాలా మంది ఇలాంటి మానసి రోగులున్నారన్నమాట.మరి వీరిని చికిత్స చేసి బాగు పరుద్దామా? పోలీసులకు పట్టిచ్చి శిక్ష వేయిద్దామా? లేక మూలాలని తెలుసుకుని పరిపూర్ణగా సమాజాన్ని శుద్ది చేద్దామా?పైన చెప్పిన అన్ని దశలూ sexuality కి సంబంధించినవైతే, మరి సమాధానం ఎక్కడ వెదకాలి ? పరిష్కారం ఎక్కడ చూడాలి? సమస్య లేదనుకుని కళ్ళు మూసుకుందామా? ఉన్నా అది మన ఆడవాళ్ళకి రాలేదని తృప్తిపడదామా? సమస్యకు సమాధానంగా పరిశోధనలు చెప్పినవాటిని "నేతి నేతి"(ఇది కాదు ఇది కాదు) అని వాయిదా వేద్దామా? తప్పించుకు తిరుగుదామా? మన సామాజిక విలువల్ని గట్టిగా పట్టుకుని మహిళల్ని మాత్రం ఈ పైచాచికానికి బలిచేద్దామా?చర్చ జరగాలి. సమాధానాలు కావాలి. అవి తప్పుడు అపోహలనుంచీ కాక విజ్ఞత, వివేచన కూడిన ఆలోచననుంచీ రావాలి.
Posted by
Kathi Mahesh Kumar
at
7:52 AM
9
comments
Labels: సమాజం
Saturday, July 5, 2008
మగాళ్ళు ‘ఈవ్ టీజింగ్’ ఎందుకు చేస్తారూ?
కాలేజిలో ఉండగా, మా హాస్టల్ ఎదురుగానే ఒక పోస్టఫీస్ ఉండేది. ప్రతిరోజూ కాలేజికి వెళ్ళే ముందు, కొంత మంది అమ్మాయిలు తాము ఇళ్ళకు రాసిన ఉత్తరాలు అక్కడ పోస్ట్ చేసి వెళ్తుండేవారు. ఒక రోజు నేను బయటకు రాగానే, గేట్ దగ్గర పేపర్ చదువుతున్న జూనియరొకడు ఉత్తరం పోస్ట్ చెయ్యడానికొచ్చిన అమ్మాయి డ్రస్సు గురించి పెద్దగా ఆ అమ్మాయికి వినపడేటట్టు కామెంట్ చెయ్యడం వినిపించింది. సాధారణంగా ఈ విషయం చికాకుని కలిగించినా, ఆ అమ్మాయి నాకు తెలిసినదవ్వటం వల్ల కొంత కోపంకూడా వచ్చింది. అయితే మా జూనియర్ అన్నది "ఒహో! కత్తి లాంటి డ్రస్" అని మాత్రమే. అప్పుడే నాకొక ఆలోచనొచ్చింది. వెంఠనే ఆ అమ్మాయిని అక్కడే ఆగమని చెప్పి, మా జూనియర్ని పట్టుకెళ్ళి తనకి introduce చేసాను. పరిచయం చేస్తూ, "he was appreciating your dress today" అని ఆ అమ్మాయితో అన్నాను. దానికి ఆ అమ్మాయి వీడ్ని చూసి ఆనందంగా, "thank you" అంది. ఆ తరువాత వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు లెండి! అది వేరే విషయం.
కానీ ఈ సంఘటన జరిగిన తరువాత ‘ఈవ్ టీజింగ్’ గురించి కొంత ఆలోచించటం జరిగింది. ఈ వికృత సంస్కృతి, డ్రస్సు గురించి కామెంటడంతో మొదలై, అమ్మాయిల శరీరాంగాల వర్ణన నుంచీ, అసభ్య పదజాలంతో ‘పిలవడం’తో పాటూ, అభ్యంతరకరంగా తాకడం వరకూ ఎన్నో రూపాల్లో ఉంటోంది. మహిళల్ని గౌరవిస్తామని చెప్పుకునే మన భారతదేశంలో 1993వ సంవత్సరంలోనే దాదాపు 84,000 కేసులు రిజిస్టెర్ అయ్యాయి. ఇక రిజిస్టర్ కానివి లక్షల్లో ఉంటాయని అస్సలు సందేహం లేదు. ఇక మరో ఆసక్తికరమైన కోణం ఏమిట్రా అంటే, ఈ కేసుల్లో అరెస్టు చెయ్యబడిన కుర్రాళ్ళలో 32% కాలేజీలకు వెళ్ళే గౌరవప్రదమైన కుటుంబాల నుంచీ వచ్చిన వాళ్ళు. ఈ విపరీతాన్ని దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం 1998లో ఒక ఆర్డినెన్స్ ఈ విషయంగా పాస్ చేసింది. దీని ప్రకారం ఇలాంటి నేరాలకి పాల్పడినవాళ్ళకి 1 సంవత్సరం జైలు శిక్షతో పాటూ 10,000 జరిమానా విధించడం జరుగుతుంది. ఇలాంటి చట్టాలు తమిళనాడుతో పాటూ దాదాపు దేశమంతా చేయబడ్డాయి. అయినా ఈ చట్టాలు నిజంగా ఉపయోగపడుతున్నాయా? అన్నది ప్రశ్నార్థకమే.
ఈ విషయం మీద జరిగిన కొన్ని పరిశోధనల్ని తీసుకుంటే, మన సమాజంలోని అణగద్రొక్కబడిన లైంగిక విధానం (suppressed sexual life style) నుండీ, సినిమాలు, అమ్మాయిల ఆహార్యం (dressing pattern) , మగాళ్ళలో తమ మగతనం పట్ల ఉన్న అపోహలూ లాంటి చాలా కారణాల్ని గుర్తించారే తప్ప, వాటిని మార్చడానికి చెయ్యాల్సిన ప్రయత్నాల పట్ల దృష్టి నిలిపినట్లుగా అనిపించదు. చట్టాన్ని చెయ్యటం అనే ఒక చిన్న భాగాన్ని మాత్రమే చెయ్యగలిగిన ప్రభుత్వం, మిగతా కారణాలలో కనీసం నామ మాత్రంగానైనా మార్పు తేవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనబడటం లేదు. ఇది చాలా సంక్లిష్టమైన సమస్య, దీన్ని సమూలంగా మార్చాలంటే, మన సమాజ నిర్మాణాన్ని fundamental గా alter చెయ్యాలి అనిపిస్తుంది. అంటే, ఇప్పట్లో ఆడవారికి ముక్తి లేదన్నమాట! కానీ, కనీస ఇందుకోసం ప్రయత్నం కూడా చేస్తున్నట్టు ఇటు సమాజం, అటు ప్రభుత్వం కనపడకపోవడం మరింత ప్రమాదకరంగా కనబడుతోంది.
సెక్స్ ఎడ్యుకేషన్ అంటే, అదేదో పాపంలా చూసే సమాజం-రాజకీయాలూ ఉన్నంత వరకూ అపోహలు దూరం కావు. అమ్మాయిలూ అబ్బాయిలూ టీనేజి -కాలేజి వయసుల్లో గౌరవప్రదమైన సంబంధాలు నెరిపే అవకాశం ఇవ్వనంత కాలం, పరస్పర గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం వీరికి రాదు. లైంగిక సంబంధాలకి, నైతికం ముసుగులు తొడిగి రహస్య వ్యభిచారానికి ప్రోత్సాహం ఇచ్చినంత కాలం, అణగద్రొక్కబడిన లైంగిక జీవితాలు బాగుపడవు. ఇక సినిమాలంటారా, హీరో "పచ్చి పచ్చిగా" హీరోయిన్ని ప్రేమిస్తేగానీ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టర, మనకు హిట్ సినిమా రాదు. ఇక ఉన్న చట్టాన్ని సక్రమంగా ఉపయోగించి శిక్షలు పడేటట్లు చెయ్యనంతకాలం ఈ విఛ్చలవిడితనం ఎలాగూ కొనసాగుతుంది.
అంటే ఈ విషయాన్ని గురించి చర్చించడం, వీలైతే కొంత బాధపడటం, లేదా చూసీచూడనట్టు నటించడం, మన ఇంట్లోని ఆడవాళ్ళకి ఇలా కాకూడదని ప్రార్థించడం మినహా మనం చెయ్యగలిగింది ఏమీ లేదన్నమాట!
Posted by
Kathi Mahesh Kumar
at
3:08 PM
30
comments
Labels: సమాజం
కొన్ని అద్భుతమైన ఛాయాచిత్రాలు, మీకోసం!





ఈ మధ్య మా ఆఫీసులో ఏవో ఫోటోల కోసం కంప్యూటర్లో వెదుకుతుండగా, ఈ ఫోటోలు దొరికాయి. అద్భుతంగా అనిపించిన ఈ మధ్యప్రదేశ్ లోని గిరిజనుల ఫోటోలను మీకోసం ఇక్కడ పొందుపరుస్తున్నాను. చూసి ఆనందించండి !
Posted by
Kathi Mahesh Kumar
at
11:11 AM
16
comments
Labels: ఫోటోలు
Friday, July 4, 2008
పోలీసులకు మానవ హక్కులు లేవా?
జూన్ 29 న చిత్రావతి రిజర్వాయర్ దగ్గర, సీలేరు నది దాటుతున్న గ్రేహౌండ్స్ దళాలపై నక్సల్స్ దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 35 మంది పోలీసులు గల్లంతయ్యారు. వీరిలో కొందరు జలసమాధి అయ్యుండొచ్చనీ, మరి కొందరు నక్సల్స్ కు బందీలుగా చిక్కిఉంటారని, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో చదువరి గారు తమ బ్లాగులో చాలా సంవేదనాత్మకమైన టపారాసి, కొన్ని చాలా ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తారు.
వారు లేవనెత్తిన ఒక ముఖ్యమైన ప్రశ్న"వాళ్ళకు (పోలీసులకు) లేవా హక్కులు? అని. ఈ ప్రశ్నతోపాటూ, నక్సల్స్ పట్ల ఇలాంటి హింస జరిగితే సర్వత్రా వాపోయే మానవ హక్కుల సంఘాల దృక్పధాన్నీ, పంధానీ ప్రశ్నించడం కూడా జరిగింది. నిజానికి ఇవి చాలా సహేతుకమైన ప్రశ్నలూ, బహుశా చాలా మంది మనసుల్లో ఎప్పటినుండో మెదిలే ప్రశలుకూడా. కాకపోతే, ఈ ప్రశ్నల గురించి అర్థవంతమైన చర్చ ‘రాజ్య హింస - మానవ హక్కులు’ అనే విషయం గురించి కూలంకషంగా తెలిస్తేగానీ, అంత సులభంగా జరపలేం. ఎందుకంటే మనలో చాలా మందికి అభిప్రాయాలు ఉంటాయేగానీ, దానికి తగిన సమాచారం ఉండదు. అందుకే, నాకు తెలిసిన కొంత భారతదేశంలో మానవహక్కుల పరిణామక్రమం యొక్క సమాచారాన్ని స్థూలంగా ఇక్కడ పొందుపరుస్తూ, చర్చని కొనసాగిస్తాను.
1936లో మొదటిగా మన భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ Indian Civil Liberties Union (ICLU) ని స్థాపించారు. దీని యొక్క ఉద్దేశ్యం వీరి మాటల్లోనే చెప్పాలంటే, The question of civil liberties arise not when the people of a country obediently carry out the orders of a government. It arises only when there is a conflict between the people and the executive authority. The idea of civil liberties is to have the right to oppose the government". ఈ మూల సిద్ధాంతం ఇప్పటికీ వర్తిస్తుంది.
ఈ ఉద్యమ పరిణామాన్ని తీసుకుంటే, దాన్ని మూడు దశలుగా సామాజిక శాస్త్రవేత్తలు విభజించారు. స్వాతంత్ర్యానంతరం నుండీ 70 ల ఆరంభం వరకూ ఈ ఉద్యమానికి ఒక విస్తృత రూపం లేదు. అందుకే దీని మొదటిది విస్తృత దశ 70లలో మొదలైందని చెప్పొచ్చు. దీన్ని ‘civil liberties phase’గా అనుకోవచ్చు. ఈ దశలో, రాజ్యం (State) తో కలిసి పౌరహక్కుల ఉల్లంఘన కాకుండా, ఒక సామరస్యమైన పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం మార్గాలు వెదకడం జరిగింది.ఈ దశలో ప్రాధమిక హక్కుల కోసం ప్రభుత్వంతో ముఖాముఖి చర్చలతో పాటూ, చట్టం న్యాయం వంటి వ్యవస్థల స్వయంప్రతిపత్తి కూడా ఈ ఉద్యమంలో భాగమయ్యింది. ‘State ఈ వ్యవస్థలను ఉపయోగించుకుని ప్రజల హక్కుల్ని కాలరాస్తోంది’ అన్న అభిప్రాయం ఈ ఉద్యమ స్ఫూర్తికి మూలం.
1975-77 ఎమర్జన్సీ సమయంలో, రాజ్యం యొక్క విశృంఖల రూపాన్ని చూసిన ఉద్యమకర్తలు 80లలో మరో పంధాను ఎంచుకున్నారు. అదే ప్రజా హక్కుల కోసం పోరాడడం, ‘rights based civil society’. ఇది రెండో దశ. ఇందులో చాలా స్పష్టంగా sate Vs civil society కోణం కనబడుతుంది. పౌర హక్కుల పరిధి, రాజ్యపరిధికి వెలుపలనున్న ఒక స్వతంత్ర్య పరిధి (realm of freedom) గా నిర్వచించడం జరిగింది. అప్పుడే రాజ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న సాయుధపోరాటాల్ని ఈ ఉద్యమం క్రిందకు తీసుకురావడం జరిగింది. నక్సలిజం అందులో ఒకటి.
మూడో దశ 90లలో మొదలైంది, ఇది మానవ హక్కులకు (human rights phase) సంబంధించినది. ఈ దశలో పౌర సమాజం, రాజకీయ వ్యవస్థను తమకు విరోధిగా గుర్తించింది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలయ్యిందని చెప్పొచ్చు. రాజకీయ వ్యవస్థ తెలివిగా, సామాజిక జీవనంలో ఉన్నటువంటి నక్సలిజం లాంటి సాయుధపోరాటాల్ని కూడా హక్కుల ఉల్లంఘనగా ఎంచి, వాటిని ఖండించడంతో పాటూ, విజయవంతంగా అణగదొక్కడానికి ప్రజా అంగీకారాన్ని కూడగట్టుకోవడం మొదలుపెట్టింది. ఈ పరిణామాలకు ఏమి చెయ్యాలో పాలుపోని ఉద్యమకారులు, నైతిక విలువలు అనే abstract కోణంలో తమ పోరాటాన్ని సాగిస్తున్నారు. అందుకే వారు ఇప్పుడు చెప్పేవి మనకు కాస్త ఆమోదయోగ్యం కాకుండా అనిపిస్తాయి.
ఇక ప్రస్తుతం ఉన్న సమస్య కొస్తే, చనిపోయిన పోలీసులకు సంతాపం ప్రకటించడం, దానితో పాటూ నక్సల్స్ దుశ్చర్యల్ని ఖండించడం మనుషులుగా మనమందరం చెయ్యాల్సిన పని. కాకపోతే, మానవహక్కుల అద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని, ప్రభుత్వంతో పోరాడుతున్న మానవ హక్కుల సంఘాలను "మీరు నక్సల్స్ కి మాత్రమే వత్తాసు పలుకుతారా? పోలీసులకు మానవహక్కులు లేవా?" అని ప్రశ్నించడం అంత తార్కికం కాదు. ఎందుకంటే, ప్రభుత్వం కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న పోలీసుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిది. ఆ బాధ్యతను విస్మరించి ఈ దారుణానికి పరోక్షంగా కారణమైన ప్రభుత్వ అలసత్వాన్నీ, నిరాసక్తతనీ, మితిమీరిన నమ్మకాన్నీ మనం కలసికట్టుగా గర్హించాలి. ఈ మానవ హక్కుల సంఘాలుకూడా, నక్సల్స్ చేతిలో ఉన్న అమాయక పోలీసులను విడిపించడంతో పాటూ, చనిపోయిన పోలీసుల కుటుంబాలకు సరైన ప్రభుత్వ సహాయం అందేలా చూడాలి.
పోలీసులకూ మానవ హక్కులున్నాయి. వాటి పరిరక్షణ బాధ్యత ఉద్యోగమిచ్చి వారి తరఫున పోరాడమని చెబుతున్న ప్రభుత్వానిది. మానవ హక్కుల సంఘాలు పని, ప్రభుత్వ పరంగా మానవ హక్కుల ఉల్లఘన జరగకుండా పోరాడటం . ఎవరి పనులు వారు సక్రమంగా చేస్తేనే మన సమాజంలో శాంతి నెలకొనేదీ, మనం సుఖంగా మనగలిగేదీ. ఈ సమయంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ వాక్యాలు గుర్తుకొస్తాయి....
సురాజ్య మవలేని
స్వరాజ్య మెందుకని?
సుఖాన మనలేని
వికాస మెందుకని?
అడుగుతోంది అదిగో...
ఎగిరే భరతపతాకం.
--------జై హింద్------
Posted by
Kathi Mahesh Kumar
at
7:04 AM
9
comments
Labels: సమాజం
Thursday, July 3, 2008
‘శాం’ మానెక్ షా కి నివాళి
మానెక్ షా గారి అంతిమయాత్రలో చాలా మంది రాజకీయ ప్రముఖులూ, ప్రభుత్వ ప్రతినిధులూ పాల్గొనకపోవడం, నాకు చాలా బాధ కలిగించిన విషయం. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ పర్యటనలో ఉండగా, ప్రధాని మన్మోహన్ సింగ్ మరియూ రక్షణ శాఖామంత్రి ఏ.కె. ఆంధొని ఢిల్లీలో ఉండికూడా హాజరుకాకపోవడం విచారకరం. 1971 లో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో వీరు చూపిన ధైర్యం, సాహసం, ముందుచూపూ మనకు విజయాన్ని తెచ్చిపెట్టిందన్న నిజం తోపాటూ, తరువాత కాలంలో చాలా పదవులు నిర్వహించి భరతమాత సేవ చేసిన ఈ వీరుడికి, మరణానంతరం తగిన గౌరవం అందలేదు అనిపించింది.
అందుకే, ఒక అజ్ఞాత సైనికుడి ఆవేదనను ప్రతిఫలించే కవితని ఇక్కడ పొందు పరుస్తున్నాను.
What I am worth…
I hear, we have crossed the sixtieth year,
Standing guard without any fear,
Another day in the desert sun,
Or a night at height, with a freezing gun,
Tell me my India 'What I am worth.'
For the Battles and Wars that I fight,
Never asking which one is right,
From Dawn to Dusk and then to Dawn,
Your Bishop, Your Knight Your Eternal Pawn,
Tell me my India 'What I am worth.'
While you fill your coffers today,
Wondering where and how to make,
Another fortune, another buy,
Your aspirations are now touching the Sky,
Tell me my India' what I am worth.'
You make a mention on your political line,
Come to my post, wine and dine,
Then run to your stock, while I stand your guard,
Killing and dying but still fighting hard,
Tell me my India' what I am worth.'
The other day I was on TV too,
You came up to me with your educated crew,
Told me to speak cos you seemed to care,
Wrote your story stripped me bare.
I was so naive I didn't know,
For you it was the nine o'clock show,
The country wants to hear some line,
Before they sleep, knowing they are fine,
Tell me my India' what I am worth.'
My Men tell me, that they are strong,
Would fight for their country, for all that's wrong,
While I tell them to stand and fight,
You ignore my existence, my very right,
Tell me my India' what I am worth.'
I thought I would tell my children in time,
How I fought for this country, this love of mine,
I wonder, if I should mention it though,
Don't want them embarrassed, while they start to grow,
Tell me my India' what I am worth.'
I was your ambition, your child hood dream,
Your Pilot, Your Sailor your Jawan in green,
Where did we part as friends, our ways
I never let you down a single day,
Tell me my India' what I am worth.'
Posted by
Kathi Mahesh Kumar
at
12:49 PM
11
comments
Labels: సమాజం
Wednesday, July 2, 2008
రాంగోపాల్ వర్మ త్రిచిత్రాలు (Trilogy) - ఒక సామాజిక విశ్లేషణ
రాంగోపాల్ వర్మ మంచి దర్శకుడా, చెత్త దర్శకుడా అనే చర్చలు తను తీసిన ప్రతి సినిమా రిలీజైన తరువాత మన మధ్యన జరిగేవే. సినీవిశ్లేషకుల నుంచీ, సాధారణ ప్రేక్షకుడి వరకూ తన సినిమాలోని ప్రతి దృశ్యం, ప్రతి కెమెరా కోణం, ప్రతి పాత్ర కదలికా చాలా ఇష్టంగా చీల్చిచండాడుతాం. ఈ love -hate సంబంధానికి మూలకారణం, ఈ దర్శకుడు చాలా ప్రతిభావంతుడూ, సమకాలీన దర్శకుల నడుమ తనదైన ప్రత్యేకత కలిగినవాడూ అవడమే అని నా నమ్మకం. ఏది ఏమైనా, ‘శివ’ సినిమాతో తెలుగు సినిమా చరిత్ర శకాల్ని మార్చిన ఈ దర్శకుడు, ముంబై వచ్చి తనకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించి భారతీయ సినీజగత్తులో కూడా ఒక కలకలాన్ని రేపాడన్నది కాదనలేని నిజం.
ఈ పరిణామక్రమంలో చాలామంది గౌరవించదగ్గ సినీదర్శకుల లాగే, తన సినిమాలలో వర్మ తనకు తెలిసిన సమాజ పార్శ్వాన్ని తెరబద్ధం చేసాడని నా విశ్వాసం. కల్పిత కథలూ, ఏడుపుగొట్టు చిత్రాలు, నిజానికి దూరమైన చిత్రీకరణ పరంపరల నడుమ, వర్మ సమాజంలోని ఒక చీకటి కోణాన్ని సహజమైన చిత్రీకరణల మధ్య విజయవంతంగా తెలుగు, భారతీయ సినిమాలకు పరిచయం చేసాడు. మనం ఎంత అసహ్యించుకున్నా, చీకటి ప్రపంచం (underworld) ఒక నిజం. మన సమాజంలో ఉన్న ఒక ముఖ్యమైన కోణం. సమాజంలో ఈ కోణం యొక్క అంచలంచల ఎదుగుదల పరిణామ క్రమం తన సినిమాల రూపంలో, తన కధానాయకుల రూపంలో "రికార్డ్" చేసాడు అనిపిస్తుంది.
అందుకే తన మొదటి సినిమా ‘శివ’, తనదంటూ ఒక శైలిని ఏర్పరిచిన ‘గాయం’ , వర్మ స్టైల్ ను ఒక శిఖరాగ్రానికి చేర్చిన ‘సత్య’ సినిమాలను తన త్రిచిత్రాలు (Trilogy)గా ఎంచి, ఒక సామాజిక విశ్లేషణ చెయ్యడం జరిగింది. ఆ విశ్లేషణ "ఈ మాట" నెట్ పత్రికకోసం రాసాను. ఈ లంకె ద్వారా ఆ విశ్లేషనాత్మక వ్యాసాన్ని చదివి, మీ అభిప్రాయాల్ని తెలుపగలరు.
Posted by
Kathi Mahesh Kumar
at
4:41 PM
13
comments
Labels: సినిమాలు

