Monday, June 7, 2010

పాతికేళ్ళ తరువాత భోపాల్ తీర్పు

భోపాల్ గ్యాస్ లీకేజీ కేసులో 26 ఏళ్ల తర్వాత స్థానిక కోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఎనిమిది మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారికి శిక్షలను ఖరారు చేయాల్సి ఉంది. రెండేళ్ల చొప్పున జైలు శిక్ష, భారీగా జరిమానా పడే అవకాశాలున్నాయి. తీవ్ర నిర్లక్ష్యానికి గాను ఎనిమిది నిందితులను కోర్టు దోషులుగా ప్రకటించింది. వారిలో పరారీలో ఉన్న యూనియన్ కార్బైడ్ కు చెందిన వారెన్ అండర్సన్ కూడా ఉన్నాడు.



1984 డిసెంబర్ 2వ తేదీన పెద్ద యెత్తున గ్యాస్ లీకైంది. రాత్రి పది గంటల సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ దుర్ఘటనలో 15 వేల మంది దాకా మరణించారు. ఐదు లక్షల మంది దాకా శ్వాసకోశ సంబంధమైన వ్యాధులకు గురయ్యారు. వేలాది మంది వికలాంగులయ్యారు.

****

8 comments:

Unknown said...

ఆ ఎనిమిది మంది హిందువులా?

Kathi Mahesh Kumar said...

@కోనసీమ కుర్రాడు: వాళ్ళది ఏ మతమైతే మాత్రం ఏం తేడా వస్తుంది? In the charges of gross negligence causing mass death they are being punished.

భావన said...

ఇన్నాళ్ళ తరువాతా?

Disp Name said...

భొపాల్ బేవార్సు తీర్పు అని శీర్షిక పెత్తి ఉంటే బాగుండేది.


zilebi
http://www.varudhini.tk

సుజాత వేల్పూరి said...

ఆ విషాదానికి గురైన కుటుంబాల్లో మిగిలి ఉన్న వాళ్లాంతా కూడా మర్చిపోయాకా? పదిహేను వేలమంది ప్రాణాలు అక్కడికక్కడ పోయాక, లక్షలమంది వ్యాధుల బారిన పడి అలమటించాక, వాళ్ళ జీవితాలు నాశనమయ్యాక....ఇప్పుడా?పాతికేళ్ళు ఒక కేసు విచారణ జరగడమేమిటి? ఎంత సిగ్గు చేటు? ఎంత అన్యాయం?
ఎవర్ని ఊరడిస్తారండీ ఈ జరిమానాలతో? ఎవరిక్కావాలి ఈ ముష్టి? నేరస్థులకు ఫిజికల్ గా శిక్ష వేసేది రెండేళ్లా?

కేవలం రెండేళ్ళా? జనం ఉమ్మేస్తారేమో అని కూడా వెరపులేదు!

మధు said...

read this post written by GOLLAPOODI MARUTHI RAO
http://www.koumudi.net/gollapudi/030209_nyayaniki.html

..nagarjuna.. said...

కోర్టు తీర్పే దౌర్భాగ్యరకరమనుకుంటే అది పాతికేళ్ల తరువాత రావడం మరింత దౌర్భాగ్యం. Its a matter of shame that it took so many years to judge sheer negligence that was so evident.
అంత పేలవమైన తీర్పు ఇచ్చేకన్నా కేసును అప్పుడే క్లోజ్చ్ చేసుంటే ఆ ఆమాయక ప్రజలు కనీసం గొర్రెలు కాకుండా ఉండేవాళ్లు.
Hail our policies and judicial system...

Nrahamthulla said...

1984 డిసెంబర్‌ రెండోతేదీ: యూనియన్‌ కార్బైడ్‌ పరిశ్రమనుంచి టన్నుల కొద్దీ లీకైన మిథైల్‌ ఐసోసైనేట్‌ (మిక్‌) మూడువేల నిండు ప్రాణాల్ని కబళించింది. కంటిచూపు పోయినవారు, వూపిరితిత్తులకు తూట్లు పడ్డవాళ్లు, జీవచ్ఛవాలుగా మిగిలినవాళ్లెందరో లెక్కే లేదు. పాతికవేలమంది నేల రాలిపోయారు. అయిదున్నర లక్షల మందికిపైగా అనారోగ్య పీడితులయ్యారు.నేటికీ అక్కడి గాలిలో, నీటిలో, భూగర్భంలో విషపదార్థ నిక్షేపాలు పుట్టబోయేవారినీ శాపగ్రస్తులు చేస్తున్నాయి.ఆ సంస్థ సారథి ఆండర్సన్‌ 1984 డిసెంబర్లో పట్టుబడినా, భారత్‌కు తిరిగి వస్తానన్న హామీతో బురిడీ కొట్టించి దేశం దాటి మళ్లీ ఇటువైపు తొంగిచూడనే లేదు. ఆండర్సన్‌ను అప్పగించాల్సిందిగా ఆరేళ్లక్రితం భారత్‌ చేసిన అభ్యర్థనను అమెరికా నిష్కర్షగా తోసిపుచ్చింది. విపరీత కాలహరణం జరిగాక ఒక్కో బాధితుడికీ సగటున విదిపింది రూ.12,410. కేంద్ర న్యాయమంత్రి వీరప్ప మొయిలీ భోపాల్‌ విషవాయు ఉదంతంలో న్యాయమే సమాధి అయిందన్నారు.